మెగా బ్రదర్స్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు సిద్దం అయిన సమయంలో కరోనా విజృంభించడంతో సినిమా వాయిదా పడినది. ఉప్పెన సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా కూడా ఖచ్చితంగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
థియేటర్లు ఓపెన్ అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే పలు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద విడుదల కాబోతున్నాయి. చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కోసం రెడీగా ఉన్నాయి. ఈ సమయంలోనే ఉప్పెన సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీస్ వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
మూడు నాలుగు నెలల వరకు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పాటు వచ్చే ఏడాది వరకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి లేరనే ఉద్దేశ్యంతో ఉప్పెన సినిమాను ఓటీటీ రిలీజ్కు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తలు నిజం కాకపోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం అయిన కూడా థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఓటీటీ విడుదల కేవలం పుకార్లు మాత్రమే అంటున్నారు. ఇదే విషయమై ఉప్పెన మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
943051 602599I genuinely like your writing style, very good information , thankyou for putting up : D. 796381
706170 658652forty people that work with all of the services Oasis provides, and he can be a very busy man, he 552927
510093 75158The place else may just anyone get that type of information in such an ideal means of writing? 732368
30704 603034Glad to be one of several visitants on this awful internet website : D. 55193