Switch to English

జగన్‌ వర్సెస్‌ కేసీఆర్‌: పోతిరెడ్డిపాడు ఫైట్‌ అటకెక్కినట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఓ వైపు కరోనా కలకలం.. ఇంకో వైపు విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజ్‌.. వెరసి.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా ఈ తరుణంలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వ్యవహారం తెరపైకొచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి, కృష్ణా నది నుంచి అవసరమైన మేర నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్ళేందుకు వీలుగా ఇంకో ప్రాజెక్టుని నిర్మించాలని భావించిన జగన్‌ ప్రభుత్వం, ఈ మేరకు ఓ జీవో కూడా విడుదల చేసింది. అంతే తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాజకీయ మాటల యుద్ధం షురూ అయ్యింది. ఎంత ఆశ్చర్యకరంగా ఈ వివాదం తెరపైకొచ్చిందో, అంతే ఆశ్చర్యకరంగా సద్దుమణిగిపోయింది.

ఎందుకిలా.? వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆశించినట్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెరుగుతుందా.? తెలంగాణ ప్రభుత్వం గుస్సా అయిన దరిమిలా వైఎస్‌ జగన్‌ ప్రయత్నాలు ఆగిపోతాయా.? అసలేం జరుగుతంది.? ఏమోగానీ, జరగాల్సిన రాజకీయ రచ్చ అయితే జరిగిపోయింది. ఓ పద్ధతి ప్రకారం తమ తమ రాష్ట్రాల్లో విపక్షాల్ని రెచ్చగొట్టడానికి అటు జగన్‌ సర్కార్‌, ఇటు కేసీఆర్‌ సర్కార్‌ వ్యూహం పన్నాయా.? అన్న దిశగా చాలా రాజకీయ విశ్లేషణలు జరిగాయి. చివరికి అదే నిజం.. అన్న భావన కలుగుతోంది.

తెలుగుదేశం పార్టీ ఈ ఎపిసోడ్‌లో వ్యూహాత్మక మౌనం పాటించింది. కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం.. రాష్ట్రాలుగా విడిపోయి.. ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రాల నేతలు మాట్లాడారు. చివరికి అంతా తుస్సుమన్నాక.. టీడీపీ ఎందుకు ఈ వ్యవహారంలో మాట్లాడటంలేదు.? అంటూ అధికార వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. అంటే, ఇంకా వైసీపీ ఆశించిన ‘పొలిటికల్‌ మైలేజ్‌’ ఈ గొడవతో రాలేదన్నమాట. సీమ ప్రయోజనాల మీద వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి అంత చిత్తశుద్దే వుంటే, మొన్నామధ్య కృష్ణా నదికి భారీ వరదలొచ్చినప్పుడే.. తగిన స్థాయిలో రాయలసీమకు నీళ్ళను తరలించేది.

అంతెందుకు, ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒప్పుకున్నారు..’ అని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటిస్తే, ఇప్పటిదాకా ఆ వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ స్పందించలేదాయె. సో, పోతిరెడ్డిపాడు రగడ కేవలం రాజకీయ రచ్చ తప్ప, సీమ మీద వైసీపీ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి కాదని తేలిపోయింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...