Switch to English

అమరావతి రగడ: జగన్‌ సర్కార్‌కి మరో ఝలక్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు.. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేయడం, పాత తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అలవాటైపోయిందా.? కీలకమైన అంశాల్లో న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలేస్తోంటే.. లక్షల రూపాయల వేతనాలు చెల్లించి సలహాదారుల్ని ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటున్నట్లు.? వారి సలహాలు అభాసుపాలవుతోంటే, న్యాయస్థానాల్లో మొట్టికాయల్ని తప్పించుకునేందుకు మళ్ళీ కోట్లు వెచ్చించి ఖరీదైన లాయర్లను పెట్టుకోవడమెందుకు.? ఏమో, జగన్‌ సర్కార్‌కే తెలియాలి.

తాజాగా హైకోర్టులో ఇంకో ఝలక్‌ తగిలింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి. అదీ అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకు చేరుకున్న తరుణంలో కావడం గమనార్హం. అమరావతి పరిధిలోని సుమారు 1300 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ళ పట్టాల కోసం కేటాయించేందుకు ప్రయత్నించింది జగన్‌ ప్రభుత్వం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదల కోసం ఈ భూమిని ఎంచుకోవడమేంటి.? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచీ, విపక్షాలనుంచీ దూసుకొచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతులు, రాజధాని కోసం భూములిచ్చారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏతో ఒప్పందాలు జరిగాయి కూడా. అందుకేనేమో.. సీఆర్డీయేని రద్దు చేసేందుకూ జగన్‌ సర్కార్‌ ప్రకటించింది.

అయితే, శాసన మండలిలో తమ పప్పులుడక్కపోవడంతో, దాన్ని రద్దు చేయడానికీ ప్లాన్‌ చేశారు. ముందే చెప్పుకున్నాం కదా.. తప్పు మీద తప్పు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తోందన్నమాట జగన్‌ ప్రభుత్వం. ఇక, 1300 ఎకరాల భూములకు సంబంధించిన జీవోని న్యాయస్థానం నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలంటే, గ్రామ కమిటీలు, స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి.. అంటూ రైతుల తరఫున న్యాయవాది తమ వాదనను విన్పించారు. మరోపక్క, ప్రభుత్వానికి సంబంధించిన విశేషాధికారాల్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ‘ఆర్‌5’ జోన్‌ని గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 355ని నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేయడం జరిగింది.

సీఆర్డీయేలో పొందుపర్చిన సెక్షన్‌ 41 అత్యంత పకడ్బందీగా రూపొందిందనీ, దీన్ని అతిక్రమించడానికి వీల్లేదని రైతులు, రాజకీయ విశ్లేషకులు, విపక్ష నేతలు మొదటి నుంచీ చెబుతున్నా, ప్రభుత్వం అత్యుత్సాహం చూపడంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏమన్నా అంటే, పేదలకు భూములిస్తామంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయ్‌.. అని బురద జల్లడం అధికార పార్టీకి అలవాటైపోయింది. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాల్లో దాదాపు 50 సార్లకు పైగా న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పలేదు వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి గడచిన ఏడాది కాలంలో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...