Switch to English

అమరావతి రగడ: జగన్‌ సర్కార్‌కి మరో ఝలక్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు.. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేయడం, పాత తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అలవాటైపోయిందా.? కీలకమైన అంశాల్లో న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలేస్తోంటే.. లక్షల రూపాయల వేతనాలు చెల్లించి సలహాదారుల్ని ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటున్నట్లు.? వారి సలహాలు అభాసుపాలవుతోంటే, న్యాయస్థానాల్లో మొట్టికాయల్ని తప్పించుకునేందుకు మళ్ళీ కోట్లు వెచ్చించి ఖరీదైన లాయర్లను పెట్టుకోవడమెందుకు.? ఏమో, జగన్‌ సర్కార్‌కే తెలియాలి.

తాజాగా హైకోర్టులో ఇంకో ఝలక్‌ తగిలింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి. అదీ అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకు చేరుకున్న తరుణంలో కావడం గమనార్హం. అమరావతి పరిధిలోని సుమారు 1300 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ళ పట్టాల కోసం కేటాయించేందుకు ప్రయత్నించింది జగన్‌ ప్రభుత్వం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదల కోసం ఈ భూమిని ఎంచుకోవడమేంటి.? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచీ, విపక్షాలనుంచీ దూసుకొచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతులు, రాజధాని కోసం భూములిచ్చారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏతో ఒప్పందాలు జరిగాయి కూడా. అందుకేనేమో.. సీఆర్డీయేని రద్దు చేసేందుకూ జగన్‌ సర్కార్‌ ప్రకటించింది.

అయితే, శాసన మండలిలో తమ పప్పులుడక్కపోవడంతో, దాన్ని రద్దు చేయడానికీ ప్లాన్‌ చేశారు. ముందే చెప్పుకున్నాం కదా.. తప్పు మీద తప్పు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తోందన్నమాట జగన్‌ ప్రభుత్వం. ఇక, 1300 ఎకరాల భూములకు సంబంధించిన జీవోని న్యాయస్థానం నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలంటే, గ్రామ కమిటీలు, స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి.. అంటూ రైతుల తరఫున న్యాయవాది తమ వాదనను విన్పించారు. మరోపక్క, ప్రభుత్వానికి సంబంధించిన విశేషాధికారాల్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ‘ఆర్‌5’ జోన్‌ని గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 355ని నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేయడం జరిగింది.

సీఆర్డీయేలో పొందుపర్చిన సెక్షన్‌ 41 అత్యంత పకడ్బందీగా రూపొందిందనీ, దీన్ని అతిక్రమించడానికి వీల్లేదని రైతులు, రాజకీయ విశ్లేషకులు, విపక్ష నేతలు మొదటి నుంచీ చెబుతున్నా, ప్రభుత్వం అత్యుత్సాహం చూపడంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏమన్నా అంటే, పేదలకు భూములిస్తామంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయ్‌.. అని బురద జల్లడం అధికార పార్టీకి అలవాటైపోయింది. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాల్లో దాదాపు 50 సార్లకు పైగా న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పలేదు వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి గడచిన ఏడాది కాలంలో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....