‘భవిష్యత్ యుద్ధాలు నీళ్ళ కోసమే అవుతాయి..’ అని చాలా ఏళ్ళ క్రితమే మేధావులు అంచనా వేశారు. ప్రపంచం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. దానికి కారణాలు అనేకం. ఆ విషయాల్ని పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళే నిప్పుల్ని రాజేస్తుండడం గత కొంతకాలంగా చూస్తూనే వున్నాం. చంద్రబాబు హయాంలోనూ జరిగిందదే. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్నదీ అదే. నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రాంతాల మధ్య ఈ నీళ్ళు నిప్పుల్ని రాజేశాయి. అలా రాజుకున్న నిప్పులు కూడా రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి రాష్ట్ర విడిపోవడానికి కారణమన్నది నిర్వివాదాంశం.
ఇక, అసలు విషయానికొస్తే, పోతిరెడ్డిపాడు వివాదం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తెరపైకి రావడం.. ఆ సమయంలో నానా యాగీ జరగడం తెల్సిన విషయాలే. ఇప్పటికీ, పోతిరెడ్డిపాడు అంశాన్ని ఆయుధంగా చేసుకుని, తెలంగాణలో రాజకీయ లబ్ది పొందుతుంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పోతిరెడ్డిపాడు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం సరికొత్తగా సంకల్పిస్తూ, కొత్త జీవో విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా, నీటి తరలింపు ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం గుస్సా అవుతోంది. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా వుండాలని కోరుకుంటున్నాం. కానీ, కొన్ని రాజకీయ శక్తులు ఆ స్నేహాన్ని చెడగొడుతున్నాయి..’ అంటూ సాక్షాత్తూ పలువురు తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు.
నిన్న మొన్నటిదాకా కేసీఆర్ ఏం చెప్పినా దానికి వైఎస్ జగన్ ‘సరే’ అని తలూపడంతో పెద్దగా ఇరు రాష్ట్రాల మధ్యా వివాదాలు రాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుపై కృష్ణా బోర్డుకి ఫిర్యాదు చేయడంతోపాటు, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార యంత్రాంగానికి తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్ వెర్షన్ ఇంకోలా వుంది. ‘మేం తెలంగాణతో సఖ్యతనే కోరుకుంటున్నాం.. కానీ, ఈ వివాదం ఎందుకు పుట్టుకొస్తుందో తెలియడంలేదు. మా వాటానే మేం సద్వినియోగం చేసకుంటాం..’ అని ఆంధ్రప్రదేశ్ చెబుతుండడం గమనార్హం.
244559 68291Thank you for writing this tremendous top quality post. The data in this material confirms my point of view and you really laid it out well. I could never have written an article this good. 947095
252546 654210Yay google is my world beater helped me to find this fantastic web site ! . 922618