మొదటి మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఎక్కడో అడవులలో సంచరించే మనిషి నవీన యుగం వైపు అడుగులు వేసి నాగరికతను ఏర్పాటు చేసుకొని ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాడు. ఎవరికి అందనంత మేధస్సును సంపాదించుకున్నాడు. జీవరాశిపై తిరుగులేని అదిపత్యం సంపాదించాడు. ఇన్ని చేసిన మనిషి కంటికి కనిపించని ఓ వైరస్ చూసి నిలువెల్లా భయపడిపోతున్నాడు. క్యాన్సర్, కలరా వంటి మహమ్మరిపై సుదీర్ఘమైన యుద్దం చేసి విజయం సాధించిన మనిషి, కరోనా విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తాడా? ఇలా చేస్తే మనిషి మనుగడ ఏమవుతుంది? మనిషికి భూమిపై నూకలు చెల్లిపోయాయా?
కరోనా వంటి మహమ్మరులను గతంలో చాలా వాటిని మనిషి ఎదుర్కొన్నాడు. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్ 19 వైరస్ అంత తేలిగ్గా అంతం అయ్యేలా కనిపించడం లేదు. గతంలో కరోనా జాతికి చెందిన వైరస్ లు మనిషిపై దాడి చేసినా వాటిని తెలిగ్గానే వదిలించుకోగలిగారు. కోవిడ్ 19 వైరస్ మాత్రం వాటికి భిన్నంగా ఉన్నది. మనిషి మనుగడను ప్రమాదస్థాయికి తీసుకెళ్ళేలా కనిపిస్తోంది. ఇప్పటకే ప్రపంచంలో ఆరు లక్షలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి.
126396 339843Thank you for your quite excellent information and respond to you. I need to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make individuals believe. Furthermore, thanks for permitting me to remark! 564826