జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చిందట. ప్రధాని నరేంద్ర మోడీతోనూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ, మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ భేటీ కోసం పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి వెళ్ళాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న సరికొత్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్కి ఢిల్లీ నుంచి పిలుపు.. అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ – జనసేన పొత్తు’ అంటూ ఆ మధ్య ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలూ ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈలోగానే ఈక్వేషన్స్ మారిపోయాయి.
బీజేపీలో కొందరు నేతలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క బీజేపీ – వైసీపీ పొత్తు, ఎన్డీయేలో వైసీపీ చేరిక.. అనే అంశం తెరపైకొచ్చింది. దాంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనానికి గురయ్యారు. వైసీపీ – బీజేపీ కలిస్తే మాకేం ఇబ్బంది లేదు, మేం అప్పుడు బీజేపీతో వుండేది లేదు.. అని పవన్ ఇటీవల తేల్చి చెప్పారు.
ఈ నేపద్యంలో, ఏపీ బీజేపీ నేతలు కొందరు, అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారట. ‘వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు..’ అని ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఖండించినా, బీజేపీలో కొందరు వైసీపీ అనుకూలుర తీరు మాత్రం అందుకు భిన్నంగా వుంది.
ఇదిలా వుంటే, ఈసారి ఢిల్లీ టూర్ ఖచ్చితంగా కీలక అంశాల ప్రస్తావన కోసమేననీ, కాస్త సమయం తీసుకున్నా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీలో ఆయా అంశాలపై స్పష్టత తప్పనిసరి అని జనసేన భావిస్తోంది. అన్నీ కుదిరితే, ఈ నెలలోనే పవన్ ఢిల్లీ టూర్ వుండొచ్చునట.
678579 56005There is noticeably a bundle comprehend this. I suppose you produced specific good points in functions also. 484726
212299 798141Enjoyed searching at this, extremely excellent stuff, thanks . 722555
740250 248665Its superb as your other posts : D, regards for posting . 314056