ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధం అయ్యింది. మరో పదిహేను ఈరోజుల్లో బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15 లోగా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లు రెడీ కాబోతున్నాయి. సంక్రాంతి లోపే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.
అన్ని పార్టీలకు పంచాయితీ ఎన్నికలు చాలా కీలకం అని చెప్పాలి. పంచాయితీ ఎన్నికల్లో ఏ పార్టీలు గెలిస్తే ఆ పార్టీలకు స్థానికంగా పట్టు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుసుకోవాలి. జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. ఎలాగైనా రాష్ట్రంలో బలపడాలని చూస్తున్నది. స్థానికంగా ఎంత బలంగా ఉంటె అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పట్టణాలు, నగరాల్లో మాత్రమే పార్టీని దృష్టి పెట్టారు. తన దృష్టిని పట్టణాలు, నగరాలతో పాటుగా గ్రామాలపై కూడా సారించాలని జనసేన పార్టీ భావిస్తోంది. గ్రామాల్లో ఎంత బలంగా ఉంటె.. అంత పట్టు ఉన్నట్టు అని చెప్పాలి. ఇక ఈరోజు నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. రాయలసీమలో ఆరు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకుల్లో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నారు. అదే విధంగా పార్టీని గ్రామస్థాయిలో కూడా బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.
569902 483151Yay google is my world beater assisted me to locate this fantastic web website ! . 489096
682957 687747Hi, you used to write outstanding posts, but the last several posts have been kinda boring I miss your wonderful posts. Past couple of posts are just a bit bit out of track! 334442