సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు తలకు మించిన భారమవుతోంది. సీనియర్ హీరోయిన్లు పెద్దగా ఫామ్ లో లేకపోవడం, ఉన్నవాళ్ళని మళ్ళీ రిపీట్ చేయలేకపోవడం వీటికి కొన్ని కారణాలు. అసలు ఒక్క హీరోయిన్ ని సెట్ చేయడమే కష్టమంటే, చిరు ఇప్పుడు చేస్తోన్న సినిమాకు ఐదుగురు హీరోయిన్ల అవసరం పడింది.
అప్పటికీ త్రిషను ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారు. అసలు ఆచార్యలో మొదట త్రిషనే నటించాల్సింది. వివిధ కారణాల వల్ల తప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ చిరు సరసన నటించే అవకాశం రాగానే ఒప్పుకుంది.
అలాగే సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా ఎస్ చెప్పింది. ఇంకా ముగ్గురు హీరోయిన్లను ఫైనలైజ్ చేయాలి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.