CSK: చెన్నై సూపర్ కింగ్స్( CSK) సారథి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni) ని ‘మిస్టర్ కూల్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. మ్యాచ్ లో విన్ అయినా, ఓడిపోయినా ఒకేలా స్వీకరించడం ధోనీకి మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే సోమవారం రాత్రి గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ధోనీ అందుకు భిన్నంగా కనిపించాడు.
ఆఖరి ఓవర్ లో 13 పరుగులు కావాల్సి ఉండగా.. నాలుగు బంతుల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులకు రావాల్సి ఉండగా ఈ దశలో ధోనీ లో టెన్షన్ కనిపించింది. కళ్లు మూసుకునే ఉన్నాడు. చివరి రెండు బంతులను జడేజా మొదటి బాల్ ని సిక్స్ గా మలచగా.. ఆఖరి బంతిని ఫుల్ టాస్ ను ఫైన్ లెగ్ వైపు కొట్టడంతో అది బౌండరీ చేరింది.
దీంతో చెన్నై జట్టు విజయం సాధించి ఐదోసారి కప్పు తన ఖాతాలో వేసుకుంది. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చిన ధోని.. జడేజా ని ఎత్తుకుని సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.