బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఇప్పటి వరకు 750 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ని చేరుకోవడం ఖాయం అంటూ షారుఖ్ ఖాన్ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.
ఇండియాతో పాటు పలు దేశాల్లో కూడా ఈ సినిమా స్క్రీనింగ్ అవుతుంది. పాకిస్తాన్ లో కూడా ఈ సినిమాను అక్కడి షారుక్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే పఠాన్ మేకర్స్ పాకిస్థాన్ లో అధికారికంగా ఈ సినిమాను విడుదల చేయలేదు, కానీ అక్కడ కొన్ని థియేటర్ల వాళ్లు పఠాన్ సినిమాను పైరసీ చేసి ఏకంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారట.
షారుఖ్ ఖాన్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏకంగా 900 రూపాయల రేటును నిర్ణయించి టికెట్లు విక్రయిస్తున్నారట. ఈ విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిసిన కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
భారీ మొత్తానికి కొనుగోలు చేయడం ఇష్టం లేని పాకిస్తాన్ థియేటర్స్ వారు ఇలా పైరసీని అక్కడి ప్రేక్షకులకు చూపిస్తూ డబ్బు సంపాదిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పఠాన్ మేకర్స్ ఇప్పటికే పాకిస్థాన్ లో స్క్రీనింగ్ ఆపేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట.
87892 973379Yay google is my world beater assisted me to discover this fantastic internet web site ! . 925919
369417 981566I genuinely prize your piece of work, Great post. 502205
145293 416936Just wanna input on couple of general things, The site layout is perfect, the articles is extremely superb : D. 575303