అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి. కానీ, ఆ అమరావతి మళ్ళీ కమ్మరావతి.! మొత్తంగా మూడు రాజధానుల్లో విశాఖదే అగ్రతాంబూలం. కర్నూలు జస్ట్ పేరుకే రాజధాని.. అందులో అదనపు ‘న్యాయం’ ఏమీ వుండదు.
సరే, ఏదో ఒకటి.! రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి వుండాలి కదా.! లేకనేం, ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అది అమరావతి మాత్రమే. కానీ, అధికార పక్షం.. అందునా, ప్రభుత్వంలో వున్నవారు అమరావతిని రాజధానిగా గుర్తించడంలేదు. ఎందుకంటే, మంత్రులే రాజధానిని స్మశానంగా అభివర్ణిస్తున్నారు. ఎడారి అంటూ కామెంట్లేస్తున్నారు. ముంపు ప్రాంతమంటూ మతిలేని వాదనలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.. అన్నది అధికార పార్టీ వాదన. ఆ లెక్కన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వుంటోన్నది రాజధాని అమరావతి పరిధిలోనే, గనుక ఆ అమరావతినే రాజధానిగా వైసీపీ నేతలు, మంత్రులు కూడా గుర్తించాల్సి వుంది. కానీ, గుర్తించడంలేదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి ఎనిమిదేళ్ళు పూర్తయిపోయింది. ఏళ్ళు గడుస్తున్నాయ్ తప్ప, రాష్ట్రానికి రాజధాని ఇదీ.. అని రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఈ దుస్థితి వుందా.? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలెందుకు తమకు రాజధాని వుందో లేదో తెలియని అయోమయ స్థితిపై గళం విప్పడంలేదు.?
జరుగుతోన్న తతంగమంతా చూస్తోంటే, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్న భావనలో రాష్ట్ర ప్రజలు వున్నట్లే కనిపిస్తోంది. ఆ ప్రజలకే రాజధాని అవసరం లేనప్పుడు, రాజధాని పేరుతో మూడు నాటకాలేంటి, ముప్ఫయ్ నాటకాలైనా అధికారంలో వున్నోళ్ళు ఆడితే దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు.
429494 984684When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 426760
969936 288717I like the way you conduct your posts. Have a nice Thursday! 142651