ఈ నెల 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాజకీయేతర జేఏసీ విశాఖ గర్జన పేరుతో ర్యాలీ చేపట్టనున్న దరిమిలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీకి ఎడా పెడా ప్రశ్నాస్త్రాలు సంధించారు. దేనికి గర్జనలు.? అంటూ జనసేనాని సంధించిన ప్రతి ప్రశ్నా, అధికార పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోందన్నది నిర్వివాదాంశం.
దేనికి గర్జనలు.? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికా.? ప్రతిపక్షంలో వున్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా.?
దేనికి గర్జనలు? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నయ్ వెళ్ళిపోతున్నందుకా.?
దేనికి గర్జనలు? విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకుంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు దారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?
దేనికి గర్జనలు? రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తుననందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనుందుకా? పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వనందుకా?
ఇలా జనసేనాని ప్రశ్నల ప్రవాహం కొనసాగింది, కొనసాగుతూనే వుంది. గడచిన మూడున్నరేళ్ళలో వైసీపీ సర్కారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందన్నది బహిరంగ రహస్యం. వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల్లో ఒకటైన అమరావతిని స్మశానంగా వైసీపీ నేతలు, అందునా మంత్రులే అభివర్ణిస్తున్నారు.
మూడు రాజధానుల్లో ఒకదాన్ని స్మశానం, ఎడారి.. అని అభివర్ణిస్తున్న వైసీపీ, మిగిలిన రెండు రాజధానుల్లో, అందునా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ విషయంలో ముందు ముందు అవే మాటలు అనదన్న గ్యారంటీ ఏముంది.?
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని వైసీపీ రెచ్చగొడుతోందన్నది నిర్వివాదాంశం. ఈ మొత్తం వ్యవహారంలో కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అంశం సైడ్ లైన్ అయిపోవడం పట్ల రాయలసీమ వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ, వాళ్ళెవరికీ నోరు పెగలడంలేదు.. తమ పార్టీ, తమ ప్రభుత్వం.. తమను నిండా ముంచేస్తున్నాసరే.!
దేనికి గర్జనలు?
151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?
— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2022
915300 557262Very interesting information !Perfect just what I was seeking for! 63950