Switch to English

నాన్నారు చంపబడ్డారు.! ‘అన్న’గార్ని వైఎస్ షర్మిల విచారణ కోరచ్చుగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అంతర్వేది రథం దగ్ధం కేసుని సీబీఐ విచారణకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుగాలి ప్రీతిపై హత్యాచారం కేసు విచారణ బాధ్యతని కూడా సీబీఐకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకుల వ్యవహారం కావొచ్చు.. ఇంకో వ్యవహారం కావొచ్చు.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని వైసీపీ సర్కారు రంగంలోకి దించుతోంది.

అంతెందుకు, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగానో, అధికార పార్టీకి చెందిన నేతలకు వ్యతిరేకంగానో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వాటిపైనా కఠిన చర్యలుంటున్నాయ్. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.

మరి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు లైట్ తీసుకున్నట్టు.? అదంటే ప్రస్తుతం సీబీఐ విచారణ పరిధిలో వుంది గనుక, ఏపీ సర్కారు ఏమీ చేయలేదట. అసలంటూ, వైసీపీ సర్కారుకి విచారణ చేతకాకపోవడం వల్లనే కదా, సీబీఐ విచారణను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరింది, హైకోర్టుకి వెళ్ళి మరీ సీబీఐ విచారణను సాధించుకున్నది. ఇప్పుడామె ఆ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు.

ఇంతటి ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు సంబంధించి విచారణను వైఎస్ షర్మిల ఎందుకు కోరగలుగుతారు.? కానీ, కోరాలి.! ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పాలన రావాలంటూ ఊరూ వాడా తిరిగారామె. గతంలో పాదయాత్ర చేశారు, 2019 ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడామె ఏపీ రాజకీయాల్లోంచి తప్పించుకుని, తెలంగాణ రాజకీయాల్లో సందడి చేస్తున్నారు.

‘మా నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు..’ అంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమెందుకు, నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఇవేవీ జరగవనుకుంటే, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అయినా ఫిర్యాదు చేయొచ్చు.

అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికిది.? తద్వారా రాజకీయంగా లాభపడిందెవరు.? ఇప్పుడు వైఎస్ షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికొస్తుంది.? అలా చేస్తే రాజకీయంగా ఎవరు లాభపడతారు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...