Switch to English

నాన్నారు చంపబడ్డారు.! ‘అన్న’గార్ని వైఎస్ షర్మిల విచారణ కోరచ్చుగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అంతర్వేది రథం దగ్ధం కేసుని సీబీఐ విచారణకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుగాలి ప్రీతిపై హత్యాచారం కేసు విచారణ బాధ్యతని కూడా సీబీఐకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకుల వ్యవహారం కావొచ్చు.. ఇంకో వ్యవహారం కావొచ్చు.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని వైసీపీ సర్కారు రంగంలోకి దించుతోంది.

అంతెందుకు, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగానో, అధికార పార్టీకి చెందిన నేతలకు వ్యతిరేకంగానో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వాటిపైనా కఠిన చర్యలుంటున్నాయ్. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.

మరి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు లైట్ తీసుకున్నట్టు.? అదంటే ప్రస్తుతం సీబీఐ విచారణ పరిధిలో వుంది గనుక, ఏపీ సర్కారు ఏమీ చేయలేదట. అసలంటూ, వైసీపీ సర్కారుకి విచారణ చేతకాకపోవడం వల్లనే కదా, సీబీఐ విచారణను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరింది, హైకోర్టుకి వెళ్ళి మరీ సీబీఐ విచారణను సాధించుకున్నది. ఇప్పుడామె ఆ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు.

ఇంతటి ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు సంబంధించి విచారణను వైఎస్ షర్మిల ఎందుకు కోరగలుగుతారు.? కానీ, కోరాలి.! ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పాలన రావాలంటూ ఊరూ వాడా తిరిగారామె. గతంలో పాదయాత్ర చేశారు, 2019 ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడామె ఏపీ రాజకీయాల్లోంచి తప్పించుకుని, తెలంగాణ రాజకీయాల్లో సందడి చేస్తున్నారు.

‘మా నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు..’ అంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమెందుకు, నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఇవేవీ జరగవనుకుంటే, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అయినా ఫిర్యాదు చేయొచ్చు.

అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికిది.? తద్వారా రాజకీయంగా లాభపడిందెవరు.? ఇప్పుడు వైఎస్ షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికొస్తుంది.? అలా చేస్తే రాజకీయంగా ఎవరు లాభపడతారు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...