విజయవాడ, రుయా ఆసుపత్రుల తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ‘ఆసుపత్రుల్లో అందరికీ కనిపించేలా ఫిర్యాదు నెంబర్లు ఉండాలి. ఆరోగ్య మిత్ర కియోస్క్ల వద్ద కూడా ఫిర్యాదు నెంబర్లు ఉంచాలి. బాధితులకు ఎటువంటి సమస్య ఎదురైనా ఫిర్యాదు చేసేలా ఉండాలి. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలపై కూడా ఫిర్యాదు నెంబర్లు ఉండాలి’.
‘ఒకటి, రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ ఘటనలో అలసత్వం వహించారనే సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు ప్రభుత్వ ప్రాధాన్యతలుగా భావించి సమర్థవంతంగా పని చేయాలి. ప్రజలకు మంచి చేసేందుకే ప్రభుత్వం ఉంది’ అని సీఎం జగన్ అన్నారు. సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్, డీజీపీ.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
490157 321589This is often a fantastic blog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 991319
347775 410614Outstanding post, I conceive individuals really should larn a good deal from this web site its really user genial . 144536
859507 245963light bulbs are good for lighting the home but stay away from incandescent lamps because they produce so considerably heat;; 146326