దేశంలో కోవిడ్ కొత్త కేసులు మూడో రోజు కూడా 3వేలకు దిగువనే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 7లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 2,876 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది.
రెండేళ్ల వ్యవధిలో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనాతో 98 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటివరకూ 5.16 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనాతో 3,884 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.24 కోట్లుగా ఉంది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న 18.9 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొత్తంగా 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. నేటి నుంచి 12-14 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. మొత్తంగా 7.11 కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నారు.
588443 988771I enjoy what you guys are typically up too. This kind of clever function and reporting! Maintain up the very great works guys Ive added you guys to blogroll. 20708
515487 710481Hey, you used to write fantastic, but the last few posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just slightly out of track! come on! 793762