Switch to English

రెండున్నరేళ్ళు.. అప్పులు తప్ప అభివృద్ధి ఏదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వైఎస్ జగన్, అధికారం కోసం చాలా చాలా చేయాల్సి వచ్చింది. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు.. వెరసి ఎలాగైతేనేం, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తి చేసుకోవడం.. అంటే, ప్రజలిచ్చిన ఐదేళ్ళ అధికారంలో సగ భాగం పూర్తి చేసుకోవడమంటే చిన్న విషయం కాదు ఇప్పుడున్న రాజకీయాల్లో. ఎన్నికల మేనిఫెస్టోని బైబిల్ తరహాలో, భగవద్గీత తరహాలో, ఖురాన్ తరహాలో.. భావించి, ప్రతి విషయానికీ కట్టుబడి.. ఆయా హామీల్ని పూర్తిగా నెరవేర్చడంలో తాము విజయం సాధించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్ సర్కారు చూపుతోన్న ప్రత్యేక శ్రద్ధని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, కేవలం సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే, నష్టపోయేది రాష్ట్రమే. ప్రతి నెలా సామాజిక పెన్షన్లు లబ్దిదారుల ఇంటివద్దకే వెళుతున్నాయి.. రేషన్ సరుకులూ ఇంటికే వెళ్ళిపోతున్నాయి. సో, రోడ్లు అవసరం లేదన్నమాట ప్రజలకి. అందుకే, రోడ్లను బాగు చేయాలన్న కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించేసింది.

రోడ్ల వ్యవహారమొక్కటే కాదు.. రెండున్నరేళ్ళు పూర్తయ్యాక కూడా తాము పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని దయనీయ స్థితి అధికార వైసీపీది. నిజానికి, ఈ దయనీయ స్థితి రాష్ట్ర ప్రజలది కూడా.

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లకీ, అక్కడ జరుగుతున్న పనులకీ పొంతన లేదు. అసలు కేంద్రం ఇంకా 55 వేల కోట్ల రూపాయల అంచనా బడ్జెట్టుని ఆమోదించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందనిగానీ, అయిపోతుందనిగానీ చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్ళిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పింది. కానీ, ఆ ప్రత్యేక హోదా అటకెక్కిపోయింది. అలా ప్రత్యేక హోదా అటకెక్కడంలో వైసీపీ పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.

గతం గతః అనుకుందాం. మరి, రానున్న రెండేళ్ళలో ఏం జరగబోతోంది.? ప్రత్యేక హోదా వస్తుందా.? పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? రాష్ట్రానికి రాజధాని ఏదన్నదానిపై స్పష్టత వస్తుందా.? ఇవన్నీ పక్కన పెడదాం, రోడ్ల మీద పడ్డ గుంతల్ని వచ్చే రెండున్నరేళ్ళలో పూడ్చగలుగుతారా.? రోడ్ల మీద గుంతలు పూడ్చడానికీ అప్పులు చేయాల్సిన దుస్థితి.. ఇదీ రాష్ట్రం పరిస్థితి. గడచిన రెండేళ్ళలో అప్పులు తప్ప అభివృద్ధి ఏది.? అప్పులు చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేసింది రాష్ట్రాన్ని. దురదృష్టమేంటంటే, అది రాష్ట్ర ప్రజలకు వరం కాదు, శాపం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...