Switch to English

రెండున్నరేళ్ళు.. అప్పులు తప్ప అభివృద్ధి ఏదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వైఎస్ జగన్, అధికారం కోసం చాలా చాలా చేయాల్సి వచ్చింది. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు.. వెరసి ఎలాగైతేనేం, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తి చేసుకోవడం.. అంటే, ప్రజలిచ్చిన ఐదేళ్ళ అధికారంలో సగ భాగం పూర్తి చేసుకోవడమంటే చిన్న విషయం కాదు ఇప్పుడున్న రాజకీయాల్లో. ఎన్నికల మేనిఫెస్టోని బైబిల్ తరహాలో, భగవద్గీత తరహాలో, ఖురాన్ తరహాలో.. భావించి, ప్రతి విషయానికీ కట్టుబడి.. ఆయా హామీల్ని పూర్తిగా నెరవేర్చడంలో తాము విజయం సాధించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్ సర్కారు చూపుతోన్న ప్రత్యేక శ్రద్ధని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, కేవలం సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే, నష్టపోయేది రాష్ట్రమే. ప్రతి నెలా సామాజిక పెన్షన్లు లబ్దిదారుల ఇంటివద్దకే వెళుతున్నాయి.. రేషన్ సరుకులూ ఇంటికే వెళ్ళిపోతున్నాయి. సో, రోడ్లు అవసరం లేదన్నమాట ప్రజలకి. అందుకే, రోడ్లను బాగు చేయాలన్న కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించేసింది.

రోడ్ల వ్యవహారమొక్కటే కాదు.. రెండున్నరేళ్ళు పూర్తయ్యాక కూడా తాము పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని దయనీయ స్థితి అధికార వైసీపీది. నిజానికి, ఈ దయనీయ స్థితి రాష్ట్ర ప్రజలది కూడా.

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లకీ, అక్కడ జరుగుతున్న పనులకీ పొంతన లేదు. అసలు కేంద్రం ఇంకా 55 వేల కోట్ల రూపాయల అంచనా బడ్జెట్టుని ఆమోదించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందనిగానీ, అయిపోతుందనిగానీ చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్ళిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పింది. కానీ, ఆ ప్రత్యేక హోదా అటకెక్కిపోయింది. అలా ప్రత్యేక హోదా అటకెక్కడంలో వైసీపీ పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.

గతం గతః అనుకుందాం. మరి, రానున్న రెండేళ్ళలో ఏం జరగబోతోంది.? ప్రత్యేక హోదా వస్తుందా.? పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? రాష్ట్రానికి రాజధాని ఏదన్నదానిపై స్పష్టత వస్తుందా.? ఇవన్నీ పక్కన పెడదాం, రోడ్ల మీద పడ్డ గుంతల్ని వచ్చే రెండున్నరేళ్ళలో పూడ్చగలుగుతారా.? రోడ్ల మీద గుంతలు పూడ్చడానికీ అప్పులు చేయాల్సిన దుస్థితి.. ఇదీ రాష్ట్రం పరిస్థితి. గడచిన రెండేళ్ళలో అప్పులు తప్ప అభివృద్ధి ఏది.? అప్పులు చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేసింది రాష్ట్రాన్ని. దురదృష్టమేంటంటే, అది రాష్ట్ర ప్రజలకు వరం కాదు, శాపం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...