ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వైఎస్ జగన్, అధికారం కోసం చాలా చాలా చేయాల్సి వచ్చింది. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు.. వెరసి ఎలాగైతేనేం, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తి చేసుకోవడం.. అంటే, ప్రజలిచ్చిన ఐదేళ్ళ అధికారంలో సగ భాగం పూర్తి చేసుకోవడమంటే చిన్న విషయం కాదు ఇప్పుడున్న రాజకీయాల్లో. ఎన్నికల మేనిఫెస్టోని బైబిల్ తరహాలో, భగవద్గీత తరహాలో, ఖురాన్ తరహాలో.. భావించి, ప్రతి విషయానికీ కట్టుబడి.. ఆయా హామీల్ని పూర్తిగా నెరవేర్చడంలో తాము విజయం సాధించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.
సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్ సర్కారు చూపుతోన్న ప్రత్యేక శ్రద్ధని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, కేవలం సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే, నష్టపోయేది రాష్ట్రమే. ప్రతి నెలా సామాజిక పెన్షన్లు లబ్దిదారుల ఇంటివద్దకే వెళుతున్నాయి.. రేషన్ సరుకులూ ఇంటికే వెళ్ళిపోతున్నాయి. సో, రోడ్లు అవసరం లేదన్నమాట ప్రజలకి. అందుకే, రోడ్లను బాగు చేయాలన్న కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించేసింది.
రోడ్ల వ్యవహారమొక్కటే కాదు.. రెండున్నరేళ్ళు పూర్తయ్యాక కూడా తాము పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని దయనీయ స్థితి అధికార వైసీపీది. నిజానికి, ఈ దయనీయ స్థితి రాష్ట్ర ప్రజలది కూడా.
పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లకీ, అక్కడ జరుగుతున్న పనులకీ పొంతన లేదు. అసలు కేంద్రం ఇంకా 55 వేల కోట్ల రూపాయల అంచనా బడ్జెట్టుని ఆమోదించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందనిగానీ, అయిపోతుందనిగానీ చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్ళిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పింది. కానీ, ఆ ప్రత్యేక హోదా అటకెక్కిపోయింది. అలా ప్రత్యేక హోదా అటకెక్కడంలో వైసీపీ పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.
గతం గతః అనుకుందాం. మరి, రానున్న రెండేళ్ళలో ఏం జరగబోతోంది.? ప్రత్యేక హోదా వస్తుందా.? పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? రాష్ట్రానికి రాజధాని ఏదన్నదానిపై స్పష్టత వస్తుందా.? ఇవన్నీ పక్కన పెడదాం, రోడ్ల మీద పడ్డ గుంతల్ని వచ్చే రెండున్నరేళ్ళలో పూడ్చగలుగుతారా.? రోడ్ల మీద గుంతలు పూడ్చడానికీ అప్పులు చేయాల్సిన దుస్థితి.. ఇదీ రాష్ట్రం పరిస్థితి. గడచిన రెండేళ్ళలో అప్పులు తప్ప అభివృద్ధి ఏది.? అప్పులు చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేసింది రాష్ట్రాన్ని. దురదృష్టమేంటంటే, అది రాష్ట్ర ప్రజలకు వరం కాదు, శాపం.
631598 856475I cant say that I completely agree, but then once more Ive never really thought of it quite like that before. Thanks for giving me something to think about when Im supposed to have an empty mind while trying to fall asleep tonight lol.. 929360
232577 51631We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 101000