కరోనాను కూడా సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. ఈ సమయంలో కరోనా జాగ్రత్తలు చెప్తాం అంటూ కొన్ని ఫేక్ లింక్స్ ఇచ్చి వాటికి క్లిక్ చేస్తే హ్యాకర్స్ తమ పని తాము చేసుకు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేసింది. అయినా కూడా కొందరు అజాగ్రత్తతో ఉంటున్నారు. సామాన్యులు విజ్ఞానం లేని వారు అలాంటి వారి చేతిలో మోస పోవడం కామన్. కాని జూబ్లీహిల్స్కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ యజమాని ఏకంగా 30 లక్షల రూపాయలను మోసపోయాడు.
హంగేరీ దేశంకు చెందిన ఒక కంపెనీ నుండి మాట్లాడుతూ ఉన్నాం అంటూ ఒక వ్యక్తి జూబ్లీహిల్స్ కు చెందిన ఒక వ్యక్తితో మాట్లాడటం జరిగింది. మాస్క్లు మరియు గ్లౌజ్లు తక్కువ రేటుకు ఇస్తామంటూ బేరసారాలు కుదుర్చుకున్నారు. 50 లక్షల డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ను వాట్సప్ ద్వారా చేసుకున్నారు. అడ్వాన్స్గా 30 లక్షల రూపాయలను చెల్లించారు. సరకు వస్తుంది వస్తుంది అంటూ నమ్మించి ఇప్పుడు ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. అడ్వాన్స్గా చెల్లించిన మొత్తం పోయినట్లేనా అంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
28327 86702Wonderful weblog, Im going to spend a lot more time reading about this subject 155479
284538 121841Woh I like your weblog posts, saved to fav! . 45075