Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో అది మూడు పువ్వులు ముప్పయ్‌ ఆరు కాయలుగా వర్దిల్లింది. ఇప్పుడేమో.. 33 పువ్వులు 3600 కాయలు అన్నట్లు తయారయ్యిందట పరిస్థితి.

కొత్త ఇసుక విధానం.. అంటూ కొన్నాళ్ళపాటు రాష్ట్రంలో ఇసుక లభ్యత లేకుండా చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఆ దెబ్బకి భవన నిర్మాణ రంగ కార్మికులు పలువురు బలవన్మరణాలకు పాల్పడాల్సి వచ్చింది. అయితే, ‘ఇసుక కొరతకు కారణం వరదలు..’ అంటూ ప్రభుత్వ పెద్దలు అర్థం పర్థం లేని కబుర్లు చెప్పారనుకోండి.. అది వేరే విషయం.

ఇక, ఇప్పుడు కూడా ఇసుక దొరకడంలేదట. కరోనా వైరస్‌ దీనికి కారణం కాదు.. ఇసుకాసురులే కారణం. ఇసుక మాఫియా అనే వైరస్‌ దెబ్బకి, ఇసుక మాయమైపోతోంది. లారీలు మాత్రం పెద్దయెత్తున ఇసుకను తరలిస్తున్నాయి. అదంతా ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ విషయమై ఇప్పటికే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, ప్రభుత్వాన్ని నిలదీస్తోన్న విషయం విదితమే.

తాజాగా, అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు, ఇసుక కొరతపై గళం విప్పుతున్నారు. ‘ఇసుక ఏమయిపోతోందో అర్థం కావడంలేదు.. ఈ దుస్థితి ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుంది..’ అంటూ అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు.. ప్రభుత్వ పెద్దల దృష్టికి పరిస్థితి తీవ్రతను తీసుకెళ్ళారు కూడా. ఇసుక అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకప్పుడు నదీ తీరాల్లో ఉచితంగా లభించే ఇసుక.. ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఎంత ఖర్చు చేద్దామన్నాసరే, అవసరాల మేర ఇసుక దొరకడంలేదంటే.. ఈ పరిస్థితిని ఏమనుకోవాలి.?

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఇసుక కొరతపై ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీని అయి వుండి కూడా తాను ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాననీ, నియోజకవర్గ ప్రజలే కాదు, అత్యంత సన్నిహితులు కూడా ఇసుక సమస్యతో బాధపడుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇసుక కుంభకోణంపై గతంలో గుంటూరు జిల్లాకి చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిథుల మధ్య గతంలో వివాదం తలెత్తితే.. అప్పట్లో ఆ వ్యవహారాన్ని చాలా తెలివిగా పార్టీ పెద్దలు ‘డైల్యూట్‌’ చేసిన విషయం విదితమే. ఇంతకీ, ఇప్పుడు ఇసుకని మింగేస్తున్న ఆ ఇసుకాసురులెవరు.? ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే.. మాయమైన ఇసుక తాలూకు లెక్కల్ని ప్రజల ముందుంచాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...