జనసేన పార్టీ మీద విమర్శలు చేసే క్రమంలో వైసీపీ, తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది రాజకీయంగా.! రాజకీయ పార్టీ అన్నాక స్టార్ క్యాంపెయినర్లంటూ వుంటారు.. ఎన్నికల సమయంలో. ఎవర్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలన్నదానిపై ఆయా పార్టీలు, లోతుగా అధ్యయనం చేస్తాయి.
ఎక్కువగా సినీ ప్రముఖులకు స్టార్ క్యాంపెయినర్లుగా చోటు కల్పించడం రాజకీయ పార్టీలకి అలవాటే. ఎందుకంటే, సినీ ప్రముఖుల్ని క్రౌడ్ పుల్లర్స్గా చూస్తాం. వాళ్ళని చూసేందుకు జనం ఎగబడతారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ నటుడు.! ఆయన సోదరుడు నాగబాబు కూడా సినీ నటుడే.! ఇంకోపక్క, జనసేన పార్టీ తరఫున చాలాకాలంగా పని చేస్తున్నాడు నటుడు హైపర్ ఆది. హైపర్ ఆది సహా చాలామంది సినీ నటులు, జనసేనతో వున్నారు.. అది గత ఎన్నికల్లో కూడా చూశాం.
హైపర్ ఆది సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ అదిరిపోయే పంచ్ డైలాగులు పేల్చుతుంటాడు. ఆ హైపర్ ఆదికి కూడా జనసేన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో చోటు దక్కింది. దాంతో, వైసీపీ సహజంగానే వెటకారం ప్రదర్శించింది. రాజకీయాల్ని జబర్దస్త్ స్కిట్ తరహాలో మార్చేశారంటూ జనసేన మీద సెటైరేసింది.
ఇంకేముంది.? వైసీపీని ట్రోల్ చేయడం షురూ అయ్యింది సోషల్ మీడియాలో. ఎందుకంటే, సాక్షాత్తూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించారు.. అదీ నాగబాబుతో కలిసి.
అంతే కాదు, జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేసే కొందరు మేల్ ఆర్టిస్టులు, గతంలో వైఎస్ జగన్ వెంట ఎన్నికల ప్రచారంలోనూ, పాదయాత్రలోనూ సందడి చేశారు.
వైసీపీ, జబర్దస్త్ నటులతో ప్రచారం చేస్తే తప్పు లేదుగానీ, జనసేన పార్టీ ఆ పని చేస్తే నేరమా.? ఇదెక్కడి వైపరీత్యం.? అని, జనం.. సోషల్ మీడియాలో పాత వీడియోల్ని తిరగతోడుతూ వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. దాంతో, వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఎటాక్ ఇచ్చే పరిస్థితి కూడా వుండటంలేదు.!