రాష్ట్రంలో యాభై కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉవాచ. రామాయపట్నం పోర్టు పనుల్ని ప్రారంభించే క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రంలో పెద్దగా పోర్టులు కట్టింది లేదనీ, తమ హయాంలోనే బోల్డన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కట్టేస్తున్నామనీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంచిదే కదా.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పొడవైన తీర ప్రాంతం వుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తే, సముద్ర తీర పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
రామాయపట్నం పోర్టుని మూడేళ్ళలో పూర్తి చేస్తామంటోంది వైఎస్ జగన్ సర్కారు. మరి, గడచిన మూడేళ్ళ వైసీపీ పాలనలో ఎన్ని పోర్టులు పూర్తయినట్లు.? పైగా, 50 కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా హార్బర్ అంటున్నారు వైఎస్ జగన్. ఇదెలా సాధ్యం.? పోర్టులు లేదా హార్బర్ల నిర్మాణం అంత తేలికైన వ్యవహారమా.? అంత చవకైన విషయమా.?
ఏం చెప్పినా, అది వేరే లెవల్లో వుండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఈ క్రమంలోనే అసలు తంటా వచ్చి పడుతుంటుంది. వాలంటీర్ల వ్యవస్థతో అనూహ్యమైన మార్పులన్నారు.. ఆ వాలంటీర్ల వికారాలకు వైసీపీ నేతలు.. అందునా ప్రజాప్రతినిథులు.. మరీ ముఖ్యంగా మంత్రులు తెగ ఇదయిపోతుండడం నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం.
రేషన్ డోర్ డెలివరీ వాహనాల వ్యవహారం అన్నారు.. దాని వల్ల ప్రయోజనమేంటి.? అని న్యాయస్థానాలు నిలదీసే పరిస్థితి వచ్చింది. రాజధాని అమరావతికి దిక్కు లేదు.. పోలవరం ప్రాజెక్టుకి అతీ గతీ లేదు. ఇప్పుడేమో, ఇది పోర్టుల వ్యవహారం.. అందునా, యాభై కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ అట.!
125368 778267Wohh exactly what I was searching for, regards for putting up. 9780
445175 968264Glad to be one of many visitants on this awing internet internet site : D. 808837
741770 9995That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be sure to keep writing. 576078