ఇంట్లో వుండి పారాసిటమాల్ వేసుకుంటే చాలు.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు.. అంటూ మొదట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కరోనా వైరస్ని చాలా లైట్ తీసుకున్నారు. కరోనా వైరస్ తీవ్రతను ముందే అంచనా వేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడంతో, వైఎస్ జగన్ ప్రదర్శించిన అసహనం.. అప్పట్లో కరోనా వైరస్ని చాలామంది లైట్ తీసుకునేలా చేసింది.
‘అదృష్టవశాత్తూ మనకి అంతర్జాతీయ ప్రయాణీకులు తక్కువ..’ అని వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచి కాదు, ఢిల్లీకి వెళ్ళి వచ్చినవారిలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలా ఢిల్లీకి మత పరమైన కార్యక్రమాల కోసం వెళ్ళినవారిలో ఏపీకి చెందిన డిప్యూటీ సీఎం కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్ళొచ్చాకనే, సీఎం జగన్తో సదరు మత పెద్దలు ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా మంతనాలు జరిపినట్లూ వార్తలొచ్చాయి. ఇదంతా దుష్ప్రచారమేనా.? వాస్తవమా.? అన్నది తేలాల్సి వుంది.
మొదట్లో ఒకటీ అరా కేసులు నమోదయ్యాయిగానీ, ఇప్పుడు ఏకంగా లిస్ట్ 50 దాటేసింది. నిన్న అర్థరాత్రిక 44గా వున్న లిస్ట్, ఈ రోజు తెల్లవారేసరికి 58 దాటేసింది. సాయంత్రానికి ఆ లిస్ట్ ఎంతగా తేలుతుందో చెప్పలేం. కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, బోల్డంత ప్రభుత్వ యంత్రాంగం.. ఇవన్నీ వుండి కూడా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా తీవ్రతను ముందుగా అంచనా వేయలేకపోయారా.? ప్రజారోగ్యం కంటే ఎన్నికల మీదనే ఆయనకు యావ ఎక్కువైపోయిందా.? అని ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం అనుకుంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవడంతో పెను ముప్పు తప్పిందిగానీ.. లేదంటే, రాష్ట్రంలో కరోనా సృష్టించే విలయం ఏ స్థాయిలో వుండోదో ఊహించుకోవడమే భయానకం.
703167 766031Howdy! I just wish to give a huge thumbs up for the excellent information you may have here on this post. I will probably be coming back to your weblog for more soon. 573369
484167 583042How considerably of an exciting piece of writing, continue creating companion 217539
248820 905248I certainly did not realize that. Learnt something new proper now! Thanks for that. 834307