ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి తండ్రి గంగి రెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లిన జగన్ అక్కడ నిన్న రాత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న రాత్రి అక్కడే బస చేసిన జగన్ నేడు ఉదయం కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి మరోసారి శ్రీవారిని దర్శించుకుని తిరుమలలో కన్నడ భక్తుల కోసం భవన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.
రేణు గుంట ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోస్ట్ కు చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుండి మామగారు అయిన గంగి రెడ్డిని పరామర్శించి అక్కడ కొద్ది సమయం ఉండి మళ్లీ మద్యాహ్నం వరకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. గంగి రెడ్డి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేదు అంటూ ఇటీవలే కాంటినెంటల్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
551734 745902I was examining some of your content material on this internet web site and I believe this site is rattling instructive! Maintain putting up. 385137
351490 212216Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres a great deal of people that I think would genuinely enjoy your content material. Please let me know. Thanks 459542