2009 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి. ‘ప్రజలు మాకు బొటాబొటీ మార్కులే ఇచ్చారు. మేం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ప్రజల ఆలోచనలు కొంత భిన్నంగా వున్నాయి. ఈ ఫలితాలతో మేం చాలా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది’ అని అప్పట్లో రాజశేఖర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన విజ్ఞతని తెలియజేశాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం, ‘ప్రజారాజ్యం పార్టీ వల్లనే మేం ఓడిపోయాం..’ అని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. కుంటి సాకులు వెతుక్కోవడమంటే ఇదే మరి.
2014 ఎన్నికల నాటికి ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగినా, ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ‘ఆంధ్రప్రదేశ్లో అధికారం మాదే..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్పుకుంది. అప్పటికి జగన్కి వున్న వేవ్ కారణంగా, జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అందరూ అనుకున్నారు. ‘బస్తీ మే సవాల్.. గెలిచేది మేమే.. ఎవరూ మా విజయాన్ని అడ్డుకోలేరు..’ అంటూ వైసీపీ నేతలు అప్పట్లో చేసిన హంగామాని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి కన్పిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.
అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మార్పు’ స్పష్టంగా కన్పిస్తోంది. ముందస్తు సర్వేలు ఏవీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేవు. అవన్నీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వున్నాయి. ‘మోడీ వేవ్, దానికి తోడు పవన్కళ్యాణ్ ఇమేజ్ కలిసొచ్చి టీడీపీకి గెలిచింది’ అని 2014 ఎన్నికల్లో తమ ఓటమికి కారణాన్ని వెతుక్కున్న వైసీపీకి, ఈసారి పరిస్థితులు కొంత అనుకూలంగానే కనిపిస్తున్న మాట వాస్తవం.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకు చాలా ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చన్న అభిప్రాయమొకటి బలంగా తెరపైకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. జనసేన పార్టీ ప్రభావం ఈసారి ఎన్నికలపై గట్టిగానే వుండబోతోంది. అదెంత? అన్నది ఇప్పటికైతే ఖచ్చితంగా అంచనా వేయలేం. కానీ, ఆ ప్రభావాన్ని ముందుగానే టీడీపీ, వైసీపీ ఫీల్ అవుతున్నాయి.
తాజాగా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి, ‘మేమే అధికారంలోకి వస్తాం, ఆ విషయాన్ని మే 19వ తేదీనే ప్రూవ్ చేస్తాం..’ అంటున్నారు. ఫలితాలు వచ్చేది మే 23న. అప్పటిదాకా జనం నాడి ఏంటన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ముందస్తు సర్వేలు కావొచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావొచ్చు.. ఇవన్నీ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు కావు. ‘అధికారంలోకి వచ్చేది మేమే..’ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న యాగీ చూస్తోంటే, ‘2014లో కూడా ఇలాగే చేశారు కదా, ఇంతకన్నా కొత్తగా వారి నుంచి ఏం ఆశించగలం?’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినా అదొక లెక్క. ఫలితాల వెల్లడికి టైమ్ ఎక్కువ పట్టింది గనుక, పోలింగ్ ముగిశాక వైసీపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు ‘మేమే గెలుస్తాం..’ అని ధీమా వ్యక్తం చేయడం ఇంకో లెక్క. ఇంకో 8 రోజుల్లో ఫలితాలొచ్చేస్తాయ్, ఈ టైమ్లో ‘బస్తీ మే సవాల్’ అనడం హాస్యాస్పదమే అవుతుంది. మరీ ముఖ్యంగా, 2014 ఎన్నికల సమయంలో ఇలా అత్యుత్సాహం చూపి భంగపడ్డ వైసీపీ, ఈసారెందుకు ‘గత పాఠాల్ని’ గుర్తుకు తెచ్చుకోవడంలేదు? ఓడితే, ఈ ప్రగల్భాలన్నీ ఆ పార్టీ మెడకి చాలా గట్టిగా చుట్టుకుంటాయి. అధినేత, జనం ముందుకు వచ్చే పరిస్థితి కూడా వుండకపోవచ్చు. వైఎస్ జగన్ పాటిస్తున్న సంయమనంలో పదో వంతైనా పార్టీ నేతలు అలవర్చుకుంటే మంచిదేమో.
945489 394128Outstanding weblog here! Also your internet site loads up quickly! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as swiftly as yours lol 137444
591011 60260Its practically impossible to find knowledgeable males and girls during this subject, however you sound like do you know what you are discussing! Thanks 100252
691703 147120The luxury proposed might be incomparable; citizens are never fail to looking for bags is a Native goals. The thought numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 789098