బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ పార్టీ, పరోక్షంగా బీజేపీ గెలుపుకి కారణమైంది. మైనార్టీ ఓటు బ్యాంకుని చీల్చడంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది. కర్నాటక, మహారాష్ట్రల్లో కూడా ఒవైసీ ప్రభావం చూపగలిగారు.. బీజేపీకి లాభం చేకూర్చడంలో.
మరి, తెలుగునాట రాజకీయాల్లో బీజేపీకి మజ్లిస్ పార్టీ చేయబోయే సాయమెంత.? ఈ అంశం చుట్టూ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి మజ్లిస్ పార్టీ మిత్రపక్షం. మిత్రపక్షమంటే, బయటనుంచి మద్దతిస్తోన్న పార్టీ.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్ కోసం జాతీయ స్థాయిలో తనవంతు కృషి చేస్తున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కేసీయార్ కోసమే అసదుద్దీన్ జాతీయ స్థాయిలో ప్రత్యక ప్రయత్నాలు చేస్తున్నారో, మజ్లిస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఈ ప్రయత్నాలోగానీ.. ఇవన్నీ బీజేపీకి లాభం చేకూర్చుతున్నాయి.
ఆ లెక్కన తెలంగాణలో కూడా మజ్లిస్ రాజకీయం, బీజేపీకి మేలు చేసే అవకాశం లేకపోలేదు. హుజూరాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్లో బీజేపీకి లాభం చేకూరింది కూడా మజ్లిస్ రాజకీయ వ్యూహం కారణంగానే. ఇదే వ్యూహం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకీ కొనసాగితే, తెలంగాణ రాష్ట్ర సమితికి అది గట్టి ఎదురుదెబ్బ అయ్యే అవకాశాల్లేకపోలేదు.
తెలంగాణ సంగతి సరే, ఆంధ్రప్రదేశ్ మాటేమిటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒవైసీ సన్నిహితుడే. 2019 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తెరవెనుకాల వైసీపీకి సహాయ సహకారాలు అందించింది తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయ్.! సో, బీజేపీకి అక్కడా కాస్తో కూస్తో ఒవైసీ, కేసీయార్ వల్ల లాభం చేకూరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
760010 843859Excellently written post, doubts all bloggers offered the same content because you, the internet is really a greater location. Please maintain it up! 530663
317824 483332Flexibility indicates your space ought to get incremented with the improve in number of weblog users. 186350