దేశంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దాంతో, కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోతుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని చూచాయిగా ధృవీకరిస్తున్నాయి కూడా. భారతదేశంలో కరోనా వైరస్ కాస్త నెమ్మదిగా వ్యాప్తి చెందుతుండడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమన్నది కొందరు నిపుణుల వాదన.
అయితే, ఇప్పుడు ప్రబలుతున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) పూర్తిగా కొత్తది. నిజానికి, కరోనా వైరస్ని దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితమే కనుగొన్నారు. ఆ కరోనా వైరస్కీ, ఇప్పుడు మనం కరోనా వైరస్గా చెప్పుకుంటున్న కరోనా వైరస్కీ (కోవిడ్ 19) చాలా తేడాలున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్ని ఇంకా మనం అర్థం చేసుకోవాల్సి వుందనీ, ఆ వైరస్ ఏ పరిస్థితుల్లో ఎంత సమయం సజీవంగా వుంటుందన్నదానిపై భిన్న వాదనలున్నాయనీ వైద్యులే చెబుతుండడం గమనార్హం. అయితే, ఇప్పుడు ప్రబలిన కరోనా వైరస్ కూడా వేడి కారణంగా కాస్త నెమ్మదించే అవకాశాలు లేకపోలేదన్నది వైద్యుల వాదన. అయినాగానీ, ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదనీ, సామాజిక దూరం పాటించడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ని నివారించడానికి ఇంకో మార్గం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
మరోపక్క, కరోనా వైరస్ సోకినవారికి వైద్య చికిత్స చేసే విషయమై రకరకాల కొత్త మందుల ప్రస్తావన ప్రపంచ వ్యాప్తంగా వస్తోంది. వాటిల్లో కొన్ని సత్పలితాలు కూడా ఇస్తున్నాయి. ఇది కొంత ఆహ్వానించదగ్గ పరిణామమే. ఏదిఏమైనా, ఈ వేసవి సీజన్లో కరోనా వైరస్ పూర్తిగా అంతమైపోవాలనే ఆశిద్దాం. ఇప్పుడు జరుగుతున్న లాక్డౌన్ ఇంకాస్త పకడ్బందీగా కొనసాగితే, తక్కువ కాలంలోనే మనం లాక్డౌన్ నుంచీ, కరోనా ముప్పు నుంచీ భయపడేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.