Switch to English

పోలవరం కన్నీళ్ళు: ఈ ఘనత చంద్రబాబుదా.? వైఎస్ జగన్‌దా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ఘనత ఎవరిది.? అన్న విషయమై చాలా రచ్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో.. జలయజ్ణం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. అంతకంటే ముందే, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిందన్నది బహిరంగ రహస్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, ప్రధాన ప్రాజెక్టుని పక్కన పెట్టి, కాలువల ద్వారా అవినీతిని పారించారన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా పొందిన దరిమిలా, అటు కేంద్రం నిధులు మంజూరు చేస్తే, ఇటు రాష్ట్రం ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిన పరిస్థితి. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, వైఎస్ జగన్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే వుంది.

పోలవరం ప్రాజెక్టు పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన. చంద్రబాబు ఆలోచనలు ఇంకోలా వుండి వుంటాయి. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ ఇళ్ళను, భూముల్ని కోల్పోయినవారి పరిస్థితేంటి.? ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు, జగన్ ఏం చెప్పారు.? అధికారంలోకి వచ్చాక ఏం చేశారు.? జనసేన మాజీ నేత కళ్యాణ్ దిలీప్ సుంకర పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల విషయమై తాజాగా ఓ వీడియో చేశారు. ఇందులో ముంపు బాధితుల ఆవేదనను కళ్ళకు కట్టినట్లుగా వినిపించారు.

పోలవరం ప్రాజెక్టులో పారేవి నీళ్ళు కాదు, ముంపు బాధితుల కన్నీళ్ళు.. అని ఆయన వీడియో చూశాక ఎవరికైనా అనిపించకమానదు. జనసేన నేతగా వున్న సమయంలోనే ఆయన పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల వెతల్ని తెలుసుకున్నారు. త్యాగాలు ఎవరివి, ఫలాలు ఎవరివి.? పబ్లిసిటీ ఎవరిది.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర సంధించిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

ముఖ్యమంత్రి నివాసం పక్కన పేదలుండటానికి వీల్లేదన్నట్టు.. పేదల ఇళ్ళను కూల్చేసిన ప్రభుత్వాల్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రాక కోసం రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేస్తున్న వైనం కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోసం ఖర్చవుతోందంటే.. అది ప్రజా ధనం తప్ప.. ఏ రాజకీయ పార్టీ తన జేబుల్లోంచి ఖర్చు చేయదు వీటి కోసం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక.. ఎవరి విగ్రహాల్ని అయినా పెట్టాలంటే.. ముంపు బాధితుల పేరుతో ఓ మ్యూజియం పెడితే బావుంటుందేమోగానీ, నాయకుల విగ్రహాల్ని పెట్టడమంటే, అంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకోటుండదు. పరిహారం ఇచ్చేస్తున్నాం.. అని ఏ ప్రభుత్వం చెప్పినా, అంతకన్నా మభ్యపెట్టే అంశం ఇంకేముంటుంది.?

పరిహారం ప్రభుత్వాలు ఇస్తాయ్.. కానీ, ఎంత.? ఎవరికి.? ఎలా.? మధ్యలో బొక్కేసే రాజకీయ దళారులు.. ఆ రాబందుల దెబ్బకి బలైపోయిన జీవితాలు.. ఔను పోలవరం ప్రాజెక్టులోంచి పారేవి ముంపు బాధితుల కన్నీళ్ళే. చాలా అంశాలపై ప్రత్యేక వీడియోలు ఎప్పటికప్పుడు చేసే కళ్యాణ్ దిలీప్ సుంకర, ఈసారి హృదయాన్ని ద్రవింపజేసేలా ఓ ఎమోషనల్ వీడియో చేయడం అభినందించదగ్గ విషయమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...