WHO: ‘కోవిడ్ (Covid-19) పరిస్థితులు అదుపులోనే ఉన్నా.. ముప్పు పూర్తిగా తొలగినట్టు కాదు. కోవిడ్ తీవ్రమయ్యేందుకు మరో వేరియంట్ రావచ్చు.. మరణాలు కూడా సంభవించవచ్చు. కోవిడ్ (Covid-19) ను మించి ప్రాణాంతకమైన వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదు’ అని 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు.
జెనీవాలో (Geneva) జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కోవిడ్ వల్ల ప్రపంచంలో 70లక్షల మరణాలు సంభవించాయి. ఇవి ఎన్నో రెట్లు ఎక్కువని తెలుసు. మరిన్ని సంక్షోభాలు రావొచ్చు. ప్రపంచ దేశాలు సమిష్టిగా నిలిచి ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదే సరైన సమయం. ప్రజారాగ్యోనికి తొమ్మిది వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మరో మహమ్మారి వస్తే తక్షణమే ఎదుర్కొనే చికిత్స లేని పరిస్థితులు ఉండకూడదు’ అని అన్నారు.
మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి ధాటికి ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. అనేక రూపాల్లో దేశాలు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికి హెచ్చరిక చేసింది.