అప్పటిదాకా ప్రశాంతంగా వున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. వందలాది మంది నిరసనకారులు, పదుల సంఖ్యలో పోలీసులు వారికి తోడు భద్రతా సిబ్బంది.. వెరసి చిన్నపాటి యుద్ధమే జరిగింది. అసలు రైళ్ళపైనా, పోలీసులపైనా ఆందోళనకారులు ఎందుకు దాడి చేసినట్లు.? పోలీసు తుపాకీల నుంచి తూటాలు ఎందుకు దూసుకెళ్ళినట్లు.?
రాష్ట్రానికీ, దేశానికీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. పరిస్థితులు అదుపు తప్పే అవకాశాన్ని ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగడుతుంది. వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల ద్వారా అల్లర్లకు వ్యూహ రచన జరిగిందని తీరిగ్గా మీడియా, పోలీసులు అనుమానిస్తున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ రక్కసి.. పరిపాలనా వైఫల్యం.. ఇవన్నీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి కారణం. విద్యార్థుల్ని అరెస్టు చేయడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకుంటే పొరపాటే. బీహార్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ విధ్వంసాలకు మూల కారణం వెతకాల్సి వుంది.
‘మేం తగ్గేది లేదు..’ అంటూ కేంద్రం భీష్మించుక్కూర్చుంటే నష్టపోయేది దేశమే. దేశాన్ని పణంగా పెట్టి, దేశాన్ని ఉద్ధరిస్తామని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రకటనలు చేస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అసలు విద్యార్థిలోకం, నిరుద్యోగులు ఎందుకింత అసహనానికి గురయ్యారన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఈ సంఘటనకు సంబంధించి బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర నిఘా వైఫల్యమంటూ బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించడం హాస్యాస్పదం.
I do not even know the way I finished up right here, however I assumed this publish used to be good.
I do not know who you’re however definitely you’re going to a well-known blogger should you aren’t already.
Cheers!
This is a topic that’s close to my heart… Thank you!
Where are your contact details though?
746031 871797I certainly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 329717