ఏపీలో వైకాపా సాగిస్తున్న పరిపాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాడు. తాజాగా ఆయన రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పై స్పందించాడు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దేవాలయాల్లో దాడులు జరిగాయి. చాలా చోట్ల దేవాలయాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా విగ్రహాల ద్వంసం కూడా జరిగింది. అయినా కూడా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నాడు.
ట్విట్టర్ లో.. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి అంటూ హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? ట్వీట్ చేశాడు. సేవ్ టెంపుల్స్ ఇన్ ఏపీ హ్యాష్ ట్యాగ్ ను ఆయన షేర్ చేశాడు. అలాగే వైకాపా నుండి ఏపీకి కాపాడండి అంటూ కూడా ట్వీట్ చేశాడు.
Die eine Sache, in Sehen Sie sich wollen zu finden ein stilvolles exklusive Geschenk ist die Tatsache,
dass es gibt normal Promotionen Sie wird in der Lage sein aufdecken.
142377 143079I agree along with your points , wonderful post. 893633
322573 249709Thanks for the info. And a response from you. car dealers hips san jose 533384