ఐపీఎల్ క్రికెట్ టోర్నీ మధ్యలో ఆగిపోవడంతో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కాస్త సమయం లభించింది. ఇన్నాళ్లూ క్రికెట్ టోర్నీలతో తీరిక లేకుండా గడిపిన కోహ్లీ.. ఈ సమయాన్ని కరోనాపై పోరుకు కేటాయించాడు. భార్య అనుష్కతో కలిసి కరోనా వ్యతిరేక పోరు ప్రారంభించాడు. కరోనాతో బాధపడుతున్నవారి కోసం సహాయ కార్యక్రమాలు షురూ చేశాడు. ఇందుకోసం విరుష్క జంట తమ వంతుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన విరాళాలను సేకరించేందుకు కూడా నడుం బిగించారు. దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారుతున్నాయని.. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోందని.. జనాలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడటానికి చాలా కష్టంగా ఉందని అనుష్క, విరాట్ పేర్కొన్నారు.
మనకోసం రేయిపగళ్లు కష్టపడుతున్న మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఏం చెప్పినా సరిపోదని.. వారికి ఇప్పుడు మన మద్దతు కావాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాము కెట్టోతో కలిసి విరాళాల సేకరణకు నడుంబిగించామని.. ఇందులో ప్రతి రూపాయీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలసి నడుద్దామని.. కరోనాను జయిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు.
787426 58204This website is often a walk-through like the information you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 562337