టాలీవుడ్ లో నిన్నటితరం నాయికల్లో విజయశాంతిది ప్రత్యేకమైన స్తానం. గ్లామర్ హీరోయిన్ గా ప్రవేశించి అగ్రకథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె ఆ తరువాత లేడి ఓరియెంటెడ్ సినిమాలతో తనదైన మార్క్ సంపాదించుకుని అటు బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానంగా సత్తా చాటి, లేడి అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలం సినిమాల్లో నటించిన విజయశాంతి పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయింది. మళ్ళీ చాలా గ్యాప్ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చింది. తెరాస పార్టీలో చేరి .. ఆ తరువాత తెరాసను వదిలేసి .. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఆమె చాలా గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందట.
నిజానికి విజయశాంతిని సినిమాల్లో మళ్ళీ నటింప చేసే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఆమె ఎవరి మాట వినలేదు. తాజాగా మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీకి ఓకే చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి మే 9న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత మహేష్ నెక్స్ట్ లేటెస్ట్ గా ఎఫ్ 2తో సంచలన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. పూర్తిస్థాయి ఫామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఇందులో ఓ కీలక పాత్రకోసం విజయశాంతిని అడిగితె ఆమె ఓకే చెప్పిందట.
ఎంతోమంది అడిగినా నో చెప్పిన విజయశాంతి మహేష్ సినిమాకు ఓకే చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. సో ఈ సినిమాలో విజయశాంతిది పవర్ ఫుల్ రోల్ అయ్యుంటుందని ప్రచారం జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమాకోసం ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో దాదాపు రెండు కోట్ల పారితోషికం అడిగిందట.. అయితే నిర్మాతలు మాత్రం మాట్లాడి కోటిన్నరకు ఒప్పించారని టాక్. మొత్తానికి అటు పారితోషికంతో సహా తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న విజయశాంతి రీ ఎంట్రీ తో ఆమె ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరి రీ ఎంట్రీ తరువాత విజయశాంతి నటన కంటిన్యూ చేస్తుందా లేదా ? అన్నది చూడాలి.
888754 192581I got what you intend, saved to favorites , extremely decent internet website . 766561
339868 154645Really fascinating info !Perfect just what I was searching for! 226386