రెడ్డిగారూ తప్పు చేస్తున్నారు.. ముంచేస్తున్నారు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,371FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో విమర్శలు చేయడం అనేది అతి సాధారణమైన అంశం. విమర్శలేని రాజకీయాన్ని ఊహించలేం. ఎంత ఎక్కువ విమర్శలు చేస్తే అంతగా అధినేతల వద్ద మెప్పు పొందవచ్చునన్న భావనలో ఇతర నేతలుంటారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో విజయసాయిరెడ్డి ఈ విషయంలో అందరికన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లున్నారు. వైఎస్‌ జగన్‌ మెప్పు కోసం విజయసాయిరెడ్డి పడుతున్న తాపత్రయం ఆ పార్టీ నేతలకు కూడా ఆశ్చర్యకరంగానే కన్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయసాయిరెడ్డి ఈ మధ్య ట్విట్టర్‌కే అధిక సమయం కేటాయిస్తున్నారు.

ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టడానికి వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా నియమించిన సంగతి తెల్సిందే. కేంద్రంలోని అధికార బీజేపీతో తెరచాటు వ్యవహారాలు నడపడంలో విజయం సాధించి, వైసీపీకి – బీజేపీకి అనుసంధానకర్తంగా వ్యవహరిస్తూ వైఎస్‌ జగన్‌ మెప్పుని బాగానే పొందగలుగుతున్నారు విజయసాయిరెడ్డి. దానికి తోడు ఇటీవలి కాలంలో ట్విట్టర్‌ వేదికగా టీడీపీ, జనసేనలపై విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలతో ఆయన తన ‘పొజిషన్‌’ని పార్టీలో ఇంకొంచెం బలోపేతం చేసుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది.

కానీ, ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాక, సామాన్యులనుంచి కూడా ప్రతిస్పందనలు చాలా గట్టిగా వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీబీఐ జేడీ, జనసేన నేత లక్ష్మినారాయణపై విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్‌ ఫైట్‌ నవ్వులపాలవుతోంది. విలవలు, విశ్వసనీయత గురించి పదే పదే వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుంటారు. మరి, ఏ విలువలు, విశ్వసనీయతతో విజయసాయిరెడ్డి అడ్డగోలుగా సోషల్‌ మీడియాలో లక్ష్మినారాయణపై ఆరోపణలు చేస్తున్నారు?

తక్షణం వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి విషయంలో అప్రమత్తం కావాల్సి వుంది. లేకపోతే, విజయసాయిరెడ్డి ట్వీట్ల వ్యవహారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చాలా డ్యామేజ్‌ చేసే అవకాశం వుంది. వైసీపీ సానుభూతి పరుల్లోనూ కొందరు, లక్ష్మినారాయణ పట్ల గౌరవభావంతో వున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసుని లక్ష్మినారాయణ గతంలో డీల్‌ చేసిన సంగతి తెల్సిందే. జగన్‌ పట్ల గౌరవం వున్నవారు కూడా, లక్ష్మినారాయణ కార్యదక్షతను ప్రశ్నించలేరు. జగన్‌ మెప్పుకోసమే కొందరు వైసీపీ నేతలు, లక్ష్మినారాయణపై విమర్శలు చేయవచ్చుగాక. అయితే అది గతం.

అధికారులుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినవారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కూడా వున్నారు. హిందూపురం లోక్‌సభకు పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌, రాజకీయాల్లోకి రాకముందు వైసీపీతో అంటకాగారని అనగలమా? లక్ష్మినారాయణ ఇంకా ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి. తొలుత విజయసాయిరెడ్డి చెత్త ట్వీట్లకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేసిన లక్ష్మినారాయణ, ఆ తర్వాత అలా స్పందించడం కూడా అనవసరమని తెలుసుకున్నారు. తన స్థాయిని తగ్గించుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు.

అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, ఆ కేసుని డీల్‌ చేసిన అధికారిపై అడ్డగోలు విమర్శలు చేయడం, దిగజారిపోతున్న విలువలకు నిదర్శనంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఓ పార్టీ జెండా కప్పుకుంటే, పార్టీ అధినేత మెప్పు కోసం ఎలాగైనా మాట్లాడేస్తారా? ఈ అర్థం పర్థం లేని ట్వీట్లతో లక్ష్మినారాయణకు పెద్దగా నష్టం లేదు, వైసీపీ ప్రజల్లో చులకనవుతుందంతే. విజయసాయి రెడ్డిగారూ, మీరే వైసీపీలో ముంచేస్తున్నారు.! విజయసాయిరెడ్డి విషయంలో జర జాగ్రత్త జగన్‌ సారూ!

8 COMMENTS

సినిమా

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.. ఎలాగంటే

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన వారెందరో ఉన్నారు. అయినా.. ఆమె వృధ్యాప్య...

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...