తమిళనాడు కోయంబేడు మార్కెట్ ద్వారా కొన్ని వందల మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెల్సిందే. ఆ విషయం ఇంకా మర్చి పోకముందే గుంటూరు కూరగాయల మార్కెట్ విషయం చర్చనీయాంశం అవుతోంది. గుంటూరు కూరగాయల మార్కెట్లో ఏకంగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు మార్కెట్ను పూర్తిగా మూసి వేయడంతో పాటు మార్కెట్లో ఉండే వారిని, అక్కడ వ్యాపారాలు చేసిన వారిని అక్కడ కూరగాయలు కొన్న వారికి క్వారెంటైన్ చేశారు.
ఇటీవల ఇద్దరు రిటైల్ వ్యాపారులు కరోనా వైరస్ బారిన పడటంతో వారు ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అనే విషయాన్ని గుర్తించిన అధికారులు తీగ లాగగా గుంటూరు కూరగాయల విషయం బయట పడినది. వారు మార్కెట్లో రెగ్యులర్గా కూరగాయలు కొంటూ ఉండేవారు. దాంతో కూరగాయల మార్కెట్ ద్వారా వారికి వైరస్ వచ్చిందని గురించిన అధికారులు 266 మందికి పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ చైన్ ఎంత దూరం పాకుతుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతోంది. గతంలో మార్కెట్కు వెళ్లిన వారు గుండె దడతో బిక్కు బిక్కు మంటున్నారు.
804892 90922Some truly good and utilitarian information on this internet website , besides I believe the layout holds wonderful functions. 666118
249071 364136My brother suggested I would possibly like this weblog. He was once entirely right. This submit actually created my day. You cant believe just how so a lot time I had spent for this details! Thank you! 446760