అప్పడెప్పుడో ఉండే వస్తు మార్పిడి పద్ధతి మరోసారి తెరపైకి వచ్చింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం నేపథ్యంలో వెనెజులా ఈ విధానానికి నాంది పలికింది. తమకు టీకాలు ఇచ్చినవారికి చమురు ఇస్తామని ఆఫర్ చేసింది. పూర్వకాలం వస్తు మార్పిడి పద్ధతి ఉందనే సంగతి తెలిసిందే. కరెన్సీ లేని నాటి సమయంలో ఒకరి దగ్గర ఉన్న వస్తువులను మరొకరికి ఇచ్చి వారి దగ్గర ఉండే వస్తువులు తీసుకునేవారు. తాజాగా వెనెజులా ఈ పద్ధతిలో టీకాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వెనెజులా ప్రధాన ఆదాయ వనరు చమురు. ఈ నేపథ్యంలో తమకు టీకాలు ఇచ్చినవారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు.
వెనెజులా వద్ద చమురు ఉందని, దాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులూ సిద్ధంగా ఉన్నారని, అయితే, తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని టీకాలు పొందేందుకు వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో టీకాలిచ్చేవారికి చమురు ఇస్తామని పేర్కొన్నారు. కానీ వెనెజులా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ వంటి దేశాలు అక్కడ నుంచి చమురు దిగుమతులు నిలిపేశాయి. మరోవైపు వెనెజులాలో రష్యా రూపొందించిన స్పుత్నిక్ తోపాటు చైనా తయారుచేసిన టీకాకి మాత్రమే అనుమతులున్నాయి.
442485 897527Enjoyed reading this, very excellent stuff, appreciate it. 746961
271288 116427There is noticeably big dollars to recognize about this. I suppose you produced particular good points in attributes also. 25472
467909 403694Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting over to WP. Also did you make this theme on your personal? Thanks. 415814