మహా ఉత్కంఠతకు దాదాపుగా తెరపడింది. ఈరోజు సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. శివాజీ పార్కులో ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది. శివసేన సర్కార్ ఈరోజు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిధులను పిలుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ లు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అదే విధంగా తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ కు కూడా ఆహ్వానం పంపారు. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అధికారంలో ఉన్నది. వైకాపా ప్రభుత్వం మొదట్లో బీజేపీకి కొంత వ్యతిరేకంగా మాట్లాడినా.. రాష్ట్ర అవసరాల దృష్ట్యా బీజేపీని వ్యతిరేకించేందుకు వెనకడుతుంది. పైగా ప్రస్తుతం జగన్ చుట్టూ సిబిఐ కేసులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలో ఏర్పాటైన మహా అఘాడి గురించి పెద్దగా మాట్లాడటం లేదు.
అదే విధంగా తెలంగాణాలో కెసిఆర్ సర్కార్ కూడా మొదట్లో ప్రదర్శించిన దూకుడును ఇప్పుడు ప్రదర్శించడం లేదు. స్థానికంగా బీజేపీతో గొడవలు ఉన్నప్పటికీ కేంద్రం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్టాలు బాగుంటాయి. ఈ సూత్రాన్ని కెసిఆర్ ముందుగానే గ్రహించారు. అందుకే శివసేన గురించి పెద్దగా మాట్లాడటం లేదు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో సఖ్యతను పాటించిన కెసిఆర్ ఇప్పుడు శివసేనతో అలా ఉంటారని అనుకోవడానికి వెళ్ళేలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీకి దగ్గరగా ఉంటున్నాయని గ్రహించిన శివసేన ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.
780400 258998Immigration Lawyers […]the time to read or visit the content material or web sites we have linked to below the[…] 987692
494444 61337Would really like to perpetually get updated fantastic blog ! . 645536
279666 684356I like this site really much, Its a quite good position to read and receive information . 864640
488508 34760quite good post, i undoubtedly adore this web site, keep on it 661560