త్రిష ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దన్నర గడుస్తున్నా కానీ తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ ముందుకు తీసుకెళుతోంది. గతేడాది 96 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. అందులో త్రిష నటనకు చాలా మంచి పేరొచ్చింది. తమిళంలో వరస సినిమాలతో త్రిష సూపర్ బిజీగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సీనియర్ హీరోయిన్, బాలీవుడ్ రీమేక్ లో నటించబోతుందని సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పీకూ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రోడ్ ట్రిప్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులను గెలుచుకుంది ఈ చిత్రం.
దీపికా పాత్రలో త్రిష ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. కోలీవుడ్ లోని ఒక బడా నిర్మాణ సంస్థ ఈ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏక కాలంలో నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది వారాల్లో రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
63402 564889I always was interested in this topic and nonetheless am, regards for posting . 908554
290071 334597Just wanna remark on couple of common issues, The website style is ideal, the topic matter is rattling great 562571