కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రోజుకు 50వేల పరిక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని సీరియస్ అయింది. కరోనా అంశాలపై దాఖలైన పిటిషన్లపై నేడు మరోసారి విచారణ జరిగింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరిక్షలు చేస్తామన్న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్ అయింది. శ్రీనివాసరావుపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టి కరోనా పరిక్షల సంఖ్య తగ్గించడం ఏంటని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఫలితాల కంటే కరోనా రెండో దశ ఫలితాలు వచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50వేల పరిక్షలు చేయాలన్న తమ ఆదేశాలను కావాలనే పక్కన పెట్టారని మండిపడింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలని మరోసారి ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అమలు చేయాలని కూడా ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం సన్నద్ధమైనట్టుగా లేదని వ్యాఖ్యానించింది.
ప్రైవేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా బాధితులకు ధైర్యం కల్పించేందుకు మానసిక వికాస కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఎన్నికల ప్రచారంలో మాస్కులు, భౌతికదూరం.. వంటి నిబంధనలు ఏవీ అమలు కావడం లేదని మండిపడింది. జీవో 64 అమలు జీహెచ్ఎంసీకి ఇవ్వడేమంటని హైకోర్టు ప్రశ్నించింది. ఆ జీవో అమలును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. డిసెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను డిసెంబర్ 17కు వాయిదా వేసింది.
178289 630003Basically wanna remark which you have a very nice internet web site , I enjoy the layout it actually stands out. 100235
799740 599688I got what you mean , saved to my bookmarks , really nice site . 650492