ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను టెన్షన్ పెడుతున్నది. ఇప్పటికే ఇండియాలో 125 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ఈనెల 31 వరకు విద్యాసంస్థలు, పార్కులు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్ వంటివి మూసెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. రోజు రోజుకు వైరస్ ప్రభావం పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నది.
అంతేకాదు, 15 రకాల మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదిలా ఉంటె ఇండియాలో మూడో కరోనా మరణం సంభవించింది. దుబాయ్ నుంచి వచ్చిన 64 ఏళ్ల వ్యక్తి ముంబైలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించాడు. దీంతో ఇండియాలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో ఒకరు, ఢిల్లీ ఒకరు మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. మరికొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.
యూరోపియన్ దేశాలు, టర్కీ, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై పూర్తిగా నిషేధం విధించింది. ఆయా దేశాల నుంచి ఇండియాకు ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. భారాతీయ పౌరులకు కూడా ఇది వర్తిస్తుందని కేంద్రం పేర్కొన్నది. ఆయా దేశాల నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా వచ్చే వారిపై సైతం ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, పూణే, నాగపూర్ నగరాల్లో 144 సెక్షన్ విధించింది. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తప్పవని, జనసమూహాలు లేకుండా చూడాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విధించిన ఆదేశాలను ఎవరైనా తప్పితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
2534 701224Hello. superb job. I did not anticipate this. This really is a splendid articles. Thanks! 570849
484948 856705I believe you did an awesome job explaining it. Confident beats having to research it on my own. Thanks 520989
798431 82012Spot on with this write-up, I actually suppose this web site needs a lot more consideration. probably be once more to learn way far more, thanks for that information. 9512