లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికుల కోసం సోనూసూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. బస్సులు, కార్లు, రైల్లు ఏకంగా విమానాలను కూడా వలస కార్మికులను ఎక్కించి వారి వారి గమ్య స్థానాలకు చేర్చడం జరిగింది. కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన సోనూసూద్ ఆ తర్వాత కూడా తన ఛారిటీని కొనసాగించాడు. సాయం కావాలన్న వారికి అండగా నిలవడంతో పాటు ప్రతి ఒక్కరి కష్టంను తన కష్టంగా భావిస్తున్న సోనూసూద్ రియల్ హీరో అంటూ కొందరు.. దేవుడు అంటూ మరి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన దుబ్బతండ వాసులు ఏకంగా సోనూసూద్కు గుడి కట్టారు.
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ పరిధిలో చెలిమె తండాలో సోనూసూద్ కు స్థానికులు గుడి కట్టారు. చెలిమె తండాకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంను నిర్వహించారు. సోనూసూద్ అభిమానులతో పాటు ఆ తండా వాసులు మరియు చుట్టుపక్కల జనాలు హాజరు అయ్యారు. జనాలుకు ఆయన చేస్తున్న సేవతో దేవుడు అయ్యాడు. అందుకే మేము ఆయన దేవాలయం నిర్మించాం అంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
349656 916127I enjoy this internet site, will certainly arrive back. Make confident you carry on writing high quality posts. 857581
186302 982954Hi, you used to write excellent articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past couple of posts are just a little out of track! 962477