ఆర్టీసీ కార్మికులు సమ్మె గండం నుంచి బయటపడి విధుల్లోకి చేరారు. విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించడంతో అంతకంటే ఇంకేం కావాలి అన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు చకచకా విధుల్లోకి చేరిపోయారు. కెసిఆర్ ఫోటోను పాలతో పాలాభిషేకం చేశారు. ఎక్కడపడితే అక్కడ కెసిఆర్ ఫోటోలకు పాలతో అభిషేకం చేస్తుండటంతో.. రాష్ట్రంలో పాలకు కరువొచ్చింది.
సమ్మె చేస్తున్నన్ని రోజులు బూతులు తిడుతూ..టైరు కింద పడేసి తొక్కుతా అని చెప్తూ తిట్లు తిట్టిన కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరమని చెప్పగానే పాలతో అభిషేకాలు చేస్తూ మీరే మాదేవుడు అంటూ పొగుడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. 52 రోజులపాటు సమ్మె చేస్తున్న సమయంలో ఆర్టీసీకి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను విధుల్లోకి తీసుకుంది.
అవసరమైతే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. రోజువారి పద్దతిలో వారిని విధుల్లోకి తీసుకున్నారు. సరే యాక్సిడెండ్లు చేసో మరొకటి చేసో ఎలాగోలా ఈ యాభై రోజులు ఆర్టీసీని నడిపించారు. రాష్ట్రానికి కొంత ఆదాయాన్ని తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు విధుల్లోకి చేరడంతో.. వీరి ఉద్యోగాలు పోయాయి. మరి వీరి పరిస్థితి ఏంటి.. తాత్కాలిక డ్రైవర్లను వాడుకొని వదిలేస్తారా.. లేదంటే.. వారికేమైనా ఉపాధి కల్పించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందా.. చూడాలి.
625552 388057Hey, you used to write fantastic, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just just a little bit out of track! come on! 944563
376007 959066really nice put up, i definitely really like this internet site, carry on it 499538
256978 604507I got what you intend,bookmarked , quite decent internet site . 337444