నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఫొటోల్ని నిస్సిగ్గుగా వాడేస్తోంది తెలుగుదేశం పార్టీ. ‘పవన్ కళ్యాణ్ అభిమానుల’ పేరుతో బ్యానర్లు వెలుస్తున్నాయ్.. హోర్డింగుల్లాంటివి దర్శనమిస్తున్నాయ్. ఇదంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకి జనాన్ని రప్పించేందుకే.!
టీడీపీ – జనసేన మధ్య పొత్తు విషయమై ఎలాంటి ప్రాథమిక చర్చలూ జరగలేదు. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇంతవరకూ రాలేదు. అయినాగానీ, టీడీపీ మాత్రం ‘జనసేనతో పొత్తు కుదిరిపోయింది’ అని ప్రచారం చేసుకుంటోంది. దానికి వైసీపీ వంత పాడుతోంది.
వైసీపీ – టీడీపీ మధ్య వున్న ‘60-40’ ఒప్పందాల్లో భాగంగా జనసేన పార్టీ మీద ‘ప్యాకేజీ’ విషం చిమ్మబడుతున్న మాట వాస్తవం. అధికారంలో వున్న వైసీపీని ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని సాధారణ పొలిటికల్ ఈక్వేషన్ని జనసేన అధినేత ప్రస్తావిస్తే, దానికి టీడీపీ నుంచి నానా రకాల పెడార్ధాలూ కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చే ఓవరాక్షన్ సంగతి సరే సరి.
వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆరోపణల్ని భారత్ రాష్ట్ర సమితి ఖండించింది. ఒకవేళ జనసేనను మిత్రపక్షంగా భావిస్తే, టీడీపీ కూడా ఆ ఆరోపణల్ని ఖండించాలి కదా.? అది చేయడంలేదు సరికదా, పవన్ కళ్యాణ్ అభిమానులు స్వాగతం పలుకుతున్నట్లుగా నారా లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ ఫొటోలతో కూడిన బ్యానర్లను తయారు చేయిస్తోంది.
అసలు ఇదేం రాజకీయం.? గతంలో జరిగిన రాజకీయాలు వేరు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు. అప్పటికీ, ఇప్పటికీ జనసేన కూడా రాజకీయం బాగానే నేర్చుకుంది. తప్పదు మరి.! అందుకే, టీడీపీ వ్యూహాల్ని తిప్పి కొడుతోంది. వైసీపీని, టీడీపీని ఒకేలా ఏకిపారేస్తోంది.
ఏపీ రాజకీయాల్లోంచి టీడీపీ మాయమైపోయే పరిస్థితుల్ని టీడీపీనే కొనితెచ్చుకుంటోంది.
993616 396569extremely great post, i definitely enjoy this exceptional site, keep on it 916249
631853 325157U never get what u expect u only get what u inspect 583806
519794 219025Created to measure curtains […]check out the web sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 315122