ఆర్టీసీ కార్మికులు గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె అంతా దేనికోసం అంటే… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి… తమ న్యాయబద్ధమైన 26 డిమాండ్లు తీర్చాలి. అన్ని చిన్న చిన్న డిమాండ్లే.. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులతో పోల్చుకుంటే ఇవేమంత పెద్దవి కాదు. కానీ, అందరిలాగే ప్రభుత్వం డిమాండ్లను పక్కన పెట్టేసింది. ఎందుకు తీర్చాలి.. అవసరం ఏంటి.. వాళ్ళే వస్తారులే అని చెప్పి పక్కన పెట్టింది. ఇచ్చిన నోటీసులను పక్కన పడేశారు… కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో కార్మికులకు ఒళ్ళు మండింది.. అక్టోబర్ 5 వ తేదీ నుంచి సమ్మెకు దిగారు.
సమ్మె చేయడం తప్పుకాదు… కానీ, ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టే దసరా, బతుకమ్మ సమయంలో సమ్మెకు దిగటంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. అసలే అధికారంలో ఉన్నది కెసిఆర్ ప్రభుత్వం.. ఆయనకు కోపం జాస్తి.. కాదన్న పనిచేస్తే సహించలేరు. అనుకున్నట్టుగానే సమ్మెకు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా.. సెల్ఫ్ డిస్మిస్ అనే పదాన్ని వాడింది. ఈ పదంతో పై అనేకరోజులు చర్చాగోష్టిలు జరిగాయి. సమ్మెకు వెళ్లారు కాబట్టి ఇక వాళ్ళను ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడటంలేదు అని ప్రభుత్వం చెప్పడంతో…ఉద్యోగులు షాక్ అవుతారని అనుకున్నారు.
ఇలాంటివి ఎన్నింటినో ఆర్టీసీ కార్మికులు చూసి ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అన్నా పట్టించుకోలేదు. సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది… ఎత్తేస్తున్నాం… ఆర్టీసీ స్థానంలో కొత్త సంస్థను తీసుకొస్తున్నామని కెసిఆర్ హుజూర్ నగర్ ఎన్నికల విజయం తారువాత ప్రకటించారు. ఈ ప్రకటనను చూసి కార్మికులు ఏ మాత్రం భయపడలేదు. ఆర్టీసీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అన్నటుగా మాట్లాడటం కెసిఆర్ కు రుచించలేదు.
ఆర్టీసీ విభజనకు చట్టబద్దత లేదా…
ఆర్టీసీకి సంబంధించిన ఈ కేసు హైకోర్టులో ఉన్నది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని ఆర్థికశాఖ, ప్రభుత్వం నివేదికలు సమర్పిచ్చింది. ఆర్టీసీ ఎండీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ విభజన కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వం చెప్పడంతో, కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
విభజనకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో ఉన్నప్పుడు ఆర్టీసీని తెలంగాణా, ఆంధ్ర ఆర్టీసీలుగా ఎలా విభజించారని ప్రశ్నించింది. ఇదే సమయంలో కేంద్రం కూడా తన వాదనలు వినిపించింది.. ఆర్టీసీలో కేంద్రం వాటా 33శాతం ఉందని, అది టీఎస్ ఆర్టీసీకి ఆటోమెటిక్గా బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అందుకే టీఎస్ ఆర్టీసీలో 33 శాతం వాటా అనే ప్రశ్నే తలెత్తబోదని స్పష్టం చేసింది.
ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, టీఎస్ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్ధత లేదని పేర్కొంది కేంద్రం. ఏపీఎస్ ఆర్టీసీని విభజిస్తే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, కేంద్రం అలాంటి అనుమతి ఇచ్చినట్లు ఆధారాల్లేవని వెల్లడించింది. ఏపీఎస్ఆర్టిసినీ చట్టబద్దంగా విభజన జరగనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ఎలా విలీనం చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఆర్టీసీని విలీనం చేయాలి అంటే ముందు చట్టబద్ధంగా విభజన జరగాలి. చట్టబద్ధంగా విభజన జరగనప్పుడు… రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తెలంగాణా ఆర్టీసీ కార్మికుల పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా చిక్కుల్లో పడింది. ఆర్టీసీని ఏపీ లో ఎలా విలీనం చేస్తారు అనే ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది.
60578 225762Very properly written story. It is going to be valuable to anyone who usess it, including yours truly . Keep up the excellent work – canr wait to read much more posts. 920317
646280 798229Intriguing, but not ideal. Are you going to write much more? 807699
548578 96273I wish I had a dime for every bad article Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 849752
397011 896150I like this weblog its a master piece! Glad I discovered this on google. 750604
579427 566866Some genuinely excellent blog posts on this internet website , regards for contribution. 973963