‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో కలిసి చేస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇది రిలీజ్ కాకముందే తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.
ఈ సినిమా తర్వాత పలు చిత్రాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. అందులో దేవా కట్టాతో ఓ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం.. తేజ్ తెలుగే కాకుండా తమిళ్ డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ కూడా వింటున్నారట. అందులో భాగంగా తమిళ్ క్రేజీ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభుతో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయడం వెంకట్ ప్రభు స్పెషాలిటీ.
‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యానీ’, ‘రాక్షసుడు’ లాంటి వెంకట్ ప్రభు సినిమాలు తెలుగులో కూడా విడుదలై ఇక్కడా విజయాన్ని అందుకున్నాయి. అనుకున్నట్టే సాయి ధరమ్ తేజ్ – వెంకట్ ప్రభు కాంబినేషన్ సెట్ అయితే వీరి నుంచి ఫుల్ ఫన్ ఉన్న ఓ థ్రిల్లర్ మూవీని ఆశించవచ్చు. మరి సెట్ అవుతుందో లేదో చూడాలి..
789553 834882All you need to have to know about News details to you. 250067
804327 810736Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 497840
637128 293975stays on topic and states valid points. Thank you. 704443