టాలీవుడ్లో మొదటి నుండి కూడా చిన్న నిర్మాతలకు కష్టాలు తప్పడం లేదు. సినిమాలు ఎంత బాగా వచ్చినా కూడా విడుదల సమయంలో థియేటర్ల సమస్య రావడం, ప్రమోషన్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వక పోవడం, యాడ్స్ బ్లాక్స్ కూడా ప్రముఖ ఛానెల్స్ ఇవ్వక పోవడం వంటివి చిన్న నిర్మాతలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సినిమాలపై ఆసక్తితో సినిమాలు నిర్మించే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. విడుదల సమయంలో బయ్యర్లు వారిని బ్లాక్ మెయిల్ చేస్తారంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో పూరి చేసిన వ్యాఖ్యలు అందరికి తెల్సిందే. ఇప్పుడు చిన్న నిర్మాతలకు మరింతగా కష్టాలు ఉన్నాయి.
ఈ సమ్మర్లో చిన్న సినిమాలు కనీసం డజను ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కాని లాక్డౌన్తో మొత్తం సినిమాలన్నీ కూడా ఆగిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత థియేటర్లు ఓపెన్ చేస్తే సినిమాలు విడుదల చేయొచ్చు అనుకున్నారు. కాని లాక్డౌన్ అయిన తర్వాత కూడా కనీసం రెండు మూడు నెలల వరకు థియేటర్లను ఓపెన్ చేయవద్దని కొందరు సూచిస్తున్నారు. ఖచ్చితంగా జులై ఆగస్టు వరకు థియేటర్లలో పూర్తి స్థాయి టికెట్లు కట్ అవ్వడం సాధ్యం అయ్యేలా లేదని కొందరు అంటున్నారు.
ఈ సమయంలో చిన్న సినిమాలను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసేందుకు పలు ఓటీటీ సంస్థలు సిద్దంగా ఉన్నాయి. బడ్జెట్ ఖర్చులు ఇచ్చి ఓటీటీలో స్క్రీమ్ చేస్తామంటూ సంస్థలు చెబుతున్నాయి. కాని నిర్మాతలు మాత్రం తమ సినిమాలను వెండి తెరపై మాత్రమే చూసుకోవాలని ఆశపడుతున్నారు. లాభమే రాని నష్టమే రాని వెండి తెరపైనే విడుదల చేయాలని ఆశ పడుతున్నారు. కాని సినిమా విడుదల వరకు వడ్డీల భారం మోయడం అంత సులభమైన విషయం కాదని కొందరు అంటున్నారు.
ఈ సమయంలో చిన్న నిర్మాతల పరిస్థితి నీటిలోనుండి బయట పడ్డ చేప పిల్లల మాదిరిగా ఉందని అంటున్నారు. ఉక్కిరిబిక్కిరి అవుతూ వారు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రోజులు చూసి వారి సినిమాలను ఓటీటీకి అమ్మేసే అవకాశం ఉందని అంటున్నారు.
294361 440010I like this site because so a lot utile stuff on here : D. 134892
446497 580034Read More HERE. I bookmarked it. 763967