ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరస ప్లాపులతో ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. 2017లో వచ్చిన శతమానం భవతి తర్వాత గత ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. గతేడాది చేసిన శ్రీకారం, మహా సముద్రం, రీసెంట్ గా విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో శర్వానంద్ తన ఆశలన్నీ యూవీ క్రియేషన్స్ పైనే పెట్టుకున్నాడు. ఈ బ్యానర్ లో తనకు రెండు హిట్స్ (రన్ రాజా రన్, మహానుభావుడు) ఉన్నాయి. తనకు పర్సనల్ క్లోజ్ అయిన ఈ నిర్మాతలతో తనకోసం ఒక ప్రాజెక్ట్ ను సెట్ చేయమని అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్ రావడం శర్వాకు చాలా ముఖ్యం.
ఇప్పటికే శర్వా చేసిన ఒకే ఒక జీవితం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. తమిళ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.
919990 841048Hey! Fine post! Please keep us posted when I can see a follow up! 35379
421170 618620quite nice publish, i undoubtedly love this web web site, carry on it 522488