మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి రేషన్ షాప్ లో పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాసిస్ట్ ముక్కలు బియ్యం వంటి ప్లాస్టిక్ వెలుగు చూసింది. ఇది రేషన్ షాపు వ్యక్తి కలిపాడా లేదంటే రేషన్ షాపుకు ఎక్కడి నుండి అయితే బియ్యం వచ్చాయో అక్కడ కలిశాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బియ్యం తీసుకున్న వ్యక్తి కడాల శంకరయ్య ఈ విషయాన్ని వెంటనే తన గ్రామ సర్పంచ్ మరియు ఇతర రాజకీయ ప్రతినిధులకు తెలియజేశాడు.
ఇది చదవండి: ఏలూరు తరహాలో నెల్లూరు.. కుప్పకూలిన కూలీలు.. ఒకరి మృతి
విషయం జిల్లా అధికారుల వద్దకు వెళ్లడంతో వెంటనే ఆ రేషన్ షాప్ ను మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రేషన్ షాప్ ను మూసే ఉంచాలి అంటూ డిమాండ్ చేశాడు. ఎంపీటీసీ మరియు ఇతర సివిల్ సప్లై అధికారులు విచారణ జరుపుతున్నట్లుగా జిల్లా యంత్రాగం పేర్కొంది. బియ్యంలో ప్లాస్టిక్ ఎలా వచ్చింది అనే విషయం నాకు తెలియదు అంటూ ఈ సందర్బంగా రేషన్ షాప్ యజమాని అంటున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న బియ్యంను కల్తీ చేస్తున్న వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
156118 808104Some truly outstanding articles on this internet site , regards for contribution. 749526
930369 656094Hiya! Amazing blog! I happen to be a everyday visitor to your site (somewhat much more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for a lot more! 15225
893167 54604hi great page i will definaely come back and see again. 537269