ఓ పక్క ఇచ్చుకుంటూ పోతున్నాం.. అని చెప్పుకుంటున్నారుగానీ, ఇంకోపక్క తగ్గించుకుంటూ పోతున్నారు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య యాగీ జరుగుతోంది. తమ హయాంలో ఎక్కువ పెన్షన్లు ఇచ్చామని టీడీపీ అంటోంది. కాదు, మా హయాంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామన్నది వైసీపీ వాదన.
ఇక, ఇప్పుడు రేషన్ కార్డుల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. సుమారు 8 లక్షల రేషన్ కార్డులపై ‘వేటు’ వేయబోతోందిట వైఎస్ జగన్ సర్కార్. 300 యూనిట్ల పైన విద్యుత్ వాడకం, నాలుగు చక్రాల వాహనం.. ఇలా పలు నిబంధనలు పెట్టి, రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంటింటి సర్వేలు చేపట్టి మరీ, సుమారు 17 లక్షల కార్డుల్ని ఏరి పారేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ స్కెచ్ గతంలోనే వేసినట్లు వార్తలొచ్చాయి.
అయితే, అప్పట్లో ఈ విషయమై ప్రభుత్వం సాహసించలేకపోయింది కార్డుల్ని ఏరివేయడానికి. కానీ, ఇప్పుడు ‘కోత’కి వేళయ్యిందట. వచ్చే నెలలో చాలా కార్డులు ఎగిరిపోతాయట. అదే నిజమైతే, అంతకన్నా దారుణం ఇంకోటుండదు. అధికారంలో ఎవరున్నా, ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు అందించే విషయమై శీతకన్ను వేస్తుంటారు.
ప్రభుత్వం అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ, అంత చిత్తశుద్ధిని ప్రస్తుత రాజకీయ పార్టీల నుంచి ఆశించలేం. ఇప్పటికే పెన్షన్లను కట్ చేశారంటూ కొందరు బాధితులు వాపోతున్న విషయం విదితమే. ఇళ్ళ స్థలాల పంపిణీ విషయంలోనూ తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడిక, రేషన్ కార్డులు కూడా ‘కట్’ చేసేస్తే ఎలా.? అన్నది వారి ఆవేదన.
సంక్షేమ పథకాల భారం పెరిగిపోతున్న దరిమిలా, దాన్ని తగ్గించుకునేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా చేస్తోందా.? అన్న విషయమై అధికార పార్టీ నేతలు పెదవి విప్పాల్సి వుంది. ఓ పక్క, పన్నులు పెంచేస్తూ జనానికి వాత పెడ్తున్న వైఎస్ జగన్ సర్కార్, ఇంకోపక్క రేషన్ కార్డుల్లోనూ కోత విధించడమంటే.. దీన్ని తరహా పాలన అనుకోవాలి.?
550767 288513I undoubtedly didnt understand that. Learnt some thing new nowadays! Thanks for that. 646610
458691 31556Gems form the internet […]very couple of websites that happen to be detailed below, from our point of view are undoubtedly nicely worth checking out[…] 776038